Don't Miss!
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ప్రభుత్వం కంటే పవన్ కళ్యాణే ఎక్కువా?
హైదరాబాద్: హుధూద్ తుఫాన్ కారణంగా విశాఖపట్నం సిటీతో పాటు చుట్టుపక్కల జిల్లాలు భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. తుపాన్ బాధితులను ఆదుకునేందుకు ఎవరికి తోచిన సహాయం వారు చేసారు. సినిమా రంగానికి చెందిన ప్రముఖులంతా భారీగా విరాళాలు అందించారు. ప్రధాని మోడీ విశాఖలో పర్యటించారు. 1000 కోట్లు సహాయం ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు 400 కోట్లు మాత్రమే విడుదల చేసారు.
కాగా...తెలుగు సినిమా పరిశ్రమ నుండి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా అత్యధికంగా రూ. 50 లక్షలు సహాయం అందించి అందరికంటే ముందు ఉన్నారు. స్వయంగా వెళ్లి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ విషయమై కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు స్పందిస్తూ తమ దృష్టిలో ప్రభుత్వం కంటే పవన్ కళ్యాణే ఎక్కువ సహాయం చేసారని అంటున్నారు.
ప్రధాని మోడీ విశాఖలో పర్యటించి ప్రభుత్వం తరుపున సహాయం ప్రకటించారు. కానీ పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బును విరాళంగా ప్రకటించారు.....ఆయన సహాయ గుణం పరంగా చూస్తే ప్రభుత్వం కంటే ఎక్కువే చేసారు అని అంటున్నారు ఫ్యాన్స్. నిజమే...వారు చెబుతున్నదాంట్లోనూ పాయింటు ఉంది.
ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆయన ‘గోపాలా గోపాలా' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. దీని తర్వాత ఆయన గబ్బర్ సింగ్-2 చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నారు.