పవన్-క్రిష్ మూవీ అప్డేట్.. చివరకు ఆ హీరోయిన్ ఫిక్స్.. అదే జరిగితే!
ఇన్నాళ్లు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల జోరు పెంచేశారు. ఇప్పటికే 'పింక్' రీమేక్ షూటింగ్లో షూటింగ్లో బిజీగా ఉన్న ఆయన.. ఇటీవలే క్రిష్ దర్శకత్వంలోనూ మరో సినిమా స్టార్ట్ చేసేశారు. దీంతో ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారనే దానిపై చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా హీరోయిన్ విషయమై ఆసక్తికర వార్త బయటకొచ్చింది.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈసినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని సమాచారం. అయితే ఈ చిత్రంలో పవన్ హీరోయిన్ విషయమై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్న క్రిష్.. ముందుగా 'కంచె' సినిమా హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ ని పరిశీలించారు. ఆ తర్వాత కియారా అద్వాని పేరు తెరపైకి వచ్చింది. కానీ తాజా సమాచారం మేరకు ఈ ఇద్దరూ కాదని కీర్తి సురేష్ వైపు మొగ్గు చూపుతున్నారట క్రిష్.

గతంలో ఇదే కీర్తి సురేష్ అజ్ఞాతవాసి సినిమాలో పవన్ సరసన నటించి భేష్ అనిపించుకుంది. ఇక మహానటి సినిమాతో ఏకంగా జాతీయ అవార్డులనే కైవసం చేసుకొని దేశ వ్యాప్త క్రెడిట్ కొట్టేసింది. ఈ సినిమాపై ఉన్న హైప్కి కీర్తి సురేష్ క్రెడిట్ కూడా తోడు కావాలని భావించి క్రిష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఏ. ఎం.రత్నం రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ అతిత్వరలో ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











