Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పవన్ కల్యాణ్తో నటించడానికి ఆ హీరోలు సిద్ధమే.. కానీ?
టాలీవుడ్ లో చాలా కాలం తరువాత మళ్ళీ మల్టీస్టారర్ సినిమాల హవా మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కెరీర్ లో రెండవసారి మరో ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక మళయాళం కథలో మన హీరోలు పోటాపోటీగా ఒక స్పెషల్ చాలెంజ్ చేసుకొనున్నారు. అయ్యప్పన్ కొశీయుమ్ రీమేక్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి అందులో మరో హీరో ఎవరనే విషయంలో అంచనాలు తారా స్థాయికి చేరాయి.
మొదటగా రానా దగ్గుబాటి అని టాక్ వచ్చింది గాని అఫీషియల్ గా ప్రకటించలేదు. ప్రొడక్షన్ హౌజ్ సీతారా ఎంటర్టైన్మెంట్ ఈ ప్రాజెక్ట్ విషయంలో పవన్ కళ్యాణ్ కి చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఒకవేల నిర్ణయం తీసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ ఓకే చెప్పాల్సిందే అంటున్నారు. ఆ తరువాత అఫీషియల్ ఎనౌన్స్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. దర్శకుడు సాగర్ చంద్ర విషయంలో కూడా అలానే చేశారట. ఇక ఇప్పుడు మరో హీరో పాత్ర కోసం నితిన్, సాయి ధరమ్ తేజ్ లిస్ట్ లో ఉన్న విషయం తెలిసిందే.
ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఫిక్స్ చేయాలని గత కొన్నిరోజులుగా ఎన్నో రకాలుగా చర్చలు జరుపుతున్నారు. నిజానికి పవన్ తో నటించడానికి ఈ ఇద్దరు హీరోలు కూడా సిద్ధంగానే ఉన్నారు. ఓ వైపు పవన్ అభిమాని, మరోవైపు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఇద్దరిలో ఎవరు సెలెక్ట్ అవుతారు అనే విషయంలో ఎవరు కూడా ఊహించలేకపోతున్నారు. ఇక పవన్ కూడా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. దర్శక నిర్మాతలు మాత్రం పవర్ స్టార్ ముందు ఒక లిస్ట్ అయితే ఉంచిదని సమాచారం. మరి ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.