Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'సాంబ' రైటర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్?
రచయిత జియస్ రావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ చిత్రం చేయనున్నాడనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. జియస్ రావు గతంలో జూ ఎన్టీఆర్, వివి వినాయిక్ కాంబినేషన్ లో వచ్చిన 'సాంబ' చిత్రానికి కథ అందించారు. ఆయన గత కొంత కాలంగా దర్శకత్వ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ లో కథ చెప్పి ఒప్పించి అక్కడ కొంత కాలం సిట్టింగ్స్ జరిపారని చెప్తున్నారు. రాణా కోసం ఆ సబ్జెక్టు అని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే రాణా తాను నటించిన లీడర్ రిలీజ్ వరకూ ఏ చిత్రం కమిట్ కాకుండా వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో జియస్ రావు ఈ పవన్ కళ్యాణ్ ని కలిసి ఈ సబ్జెక్టును వినిపించి ఒప్పించారని తెలుస్తోంది. అయితే పవన్ కొన్ని మార్పులు చెప్పారని, అప్పుడే ఫైనల్ అవుతుందని చెప్తున్నారు. ఇక అధికారికంగా ఈ విషయమై ఏ సమాచారం లేదు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న పులి చిత్రం ఫైనల్ స్టేజస్ లో ఉంది.