Don't Miss!
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ సూపర్ హిట్ సీక్వెల్ లో పవన్ కళ్యాణ్!?
పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరసగా సినిమాలు ఓకే చేస్తూ బిజీ అయిపోతున్నారు. తాజాగా అర్జున్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఒకే ఒక్కడు సీక్వెల్ లో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాసముందని సమాచారం. అందుకు గానూ శంకర్ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పవన్ తో తెలుగు,తమిళ భాషల్లో భారీగా ఈ చిత్రం రూపొందించి హిట్ కొట్టాలని శంకర్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నారు.
దేశంలో పెరిగిపోతున్న అవినీతి, అక్రమాలు ఈ చిత్రంలో చర్చించనున్నట్లు చెన్నై వర్గాల సమాచారం. సినిమా పూర్తిగా దేశ రక్షణదళంలో పేరుకుపోయిన అవినీతి చుట్టూ తిరుగబోతున్నట్లుగా చెప్తున్నారు. ఇక ప్రస్తుతం పవన్ పూరీ జగన్నాథ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు'కి డేట్స్ కేటాయించారు. మరో ప్రక్క గబ్బర్ సింగ్ ప్రమోషన్ కి ప్లానింగ్ లో ఉన్నారు. శంకర్ ..విజయ్ తో తెరకెక్కించిన త్రీ ఇడియట్స్ రీమేక్ భాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవటంతో ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నారు.