Don't Miss!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వావ్.. పవన్, ప్రభాస్కి అలా మ్యాచ్ అయ్యింది, ఫ్యాన్స్ కి పండగే!
ఇతర ఇండస్ట్రీలో సినిమాలపై కరోనా ఎంత ప్రభావం చూపిందో తెలియదు గాని టాలీవుడ్ లో మాత్రం ఒక విధంగా ఇప్పుడు అభిమానులకు మంచి కిక్ లభిస్తోంది. ఎందుకంటే స్టార్ హీరోలు ఒక సినిమా అయిపోతే గాని మరొక సినిమా గురించి ఆలోచించని ఈ రోజుల్లో ఒకేసారి వివిధ రకాల కథలను ఒప్పుకునే ఛాన్స్ వచ్చింది. కరోనా లాక్ డౌన్ పుణ్యమా అంటూ ఎంతగానో ఆలోచించి కొత్త తరహా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నారు.
ఒక విషయంలో ప్రభాస్, పవన్ కళ్యాణ్ కి మ్యాచ్ అయ్యిందనే చెప్పాలి. ఈ ఇద్దరు స్టార్ హీరోలు యాదృచ్చికంగా ఒకేసారి నాలుగు సినిమాలను లైన్ లొ పెట్టారు. ఒక వైపు ప్రభాస్ రాధే శ్యామ్ తో బిజీగా ఉంటే మరోవైపు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ని రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేస్తుండగా పవన్ క్రిష్ తో కలవనున్నారు. పవర్ స్టార్ హరీష్ శంకర్ సినిమాతో పాటు సురేందర్ రెడ్డి సినిమాను కూడా ఆల్ మోస్ట్ ఫిక్స్ చేసుకున్నాడు.
ఇక రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ తరువాత ఓం రావత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమాను చేయనున్నాడు. అలాగే KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మరో సినిమా చేయనున్నాడు. ఈ విధంగా పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఒకేసారి నాలుగు సినిమాలను చేతుల్లో ఉంచుకొని అభిమానుల్లో పవర్ఫుల్ జోష్ నింపుతున్నారు. మరి ఆ సినిమాలతో ఈ స్టార్స్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటారో చూడాలి.