Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ స్టార్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ చెప్పినా కూడా వినట్లేదట
పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ వరుసగా సినిమాలనైతే ఎనౌన్స్ చేస్తున్నాడు గాని ఇంకా ఒక్క టీజర్ కూడా ఆడియెన్స్ కోసం వదల్లేదు. కరోనా కారణంగా వకీల్ సాబ్ హంగామా వాయిదా పడింది. ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. దిల్ రాజు కూడా చప్పుడు చేయడం లేదు. వకీల్ సాబ్ అనంతరం వెంటనే మలయాళం రీమేక్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాతో రెడీ అవ్వాలని అనుకుంటున్నాడు. రానున్న రోజుల్లో పవన్ మరింత బిజీ కానున్నట్లు తెలుస్తోంది.
క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అయితే ముందుగా ఈ రెండు సినిమాలు పూర్తయ్యేసరికి సమయం చాలానే పడుతుంది. అందుకే ఇటీవల పవన్ హరీష్ శంకర్ కు కాస్త ఆలస్యం అవుతుందని చెప్పాడు. అప్పటిలోపు ఇంకో సినిమా చేసుకోమ్మని కూడా సలహా ఇచ్చాడట. సురేందర్ రెడ్డికి కూడా అలాంటి సలహానే ఇచ్చాడు. అందుకే ఆయన అఖిల్ తో ఒక సినిమా చేసి అనంతరం పవన్ తో చేయాలని ప్లాన్ చేసుకున్నాడు.
కానీ హరీష్ శంకర్ మాత్రం ఆ విధంగా చేయడానికి ఏ మాత్రం ఇష్ట పడటం లేదట. నెక్స్ట్ సినిమా చేస్తే పవర్ స్టార్ తోనే చేయలేని మొండిగా డిసిషన్ తీసుకున్నాడట. పవన్ కళ్యాణ్ ఆలస్యం అవ్వవచ్చని చెప్పినప్పటికీ హరీష్ పెద్దగా పట్టించుకోలేదని తన దృష్టి మొత్తం స్క్రిప్ట్ పైనే ఉన్నట్లు సమాధానం ఇస్తున్నాడట.
ఇక హరీష్ పవన్ కోసం సెట్ చేసిన కథ గురించి కొన్ని రూమర్స్ అయితే వైరల్ అవుతున్నాయి. ఆ సినిమాలో పవన్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడట. అంతే కాకుండా పవన్ ఆశయాలకు దగ్గరగా ఆ సినిమా ఉంటుందని ఒక పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. మరి ఆ సినిమాను పవన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో చూడాలి.