Don't Miss!
- News ఎన్నికల్లో కీలక ఘట్టం ..నేటి నుంచే నామినేషన్లు షూరూ
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
మహేష్ ని ప్రక్కన పెట్టి పవన్ కళ్యాణ్ తో నే?
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. దగ్గుపాటి రాణాతో 'కృష్ణంవందే జగద్గురుమ్' చిత్రం తెరకెక్కించిన క్రిష్ దర్శకత్వంలో చేయటానికి పవన్ ఓకే చేసారని తెలుస్తోంది. వివరాల్లోకెళితే... ఇటీవలే పవన్కల్యాణ్ 'కృష్ణంవందే జగద్గురుమ్' చూసి... ఆ సినిమా బాగా నచ్చడంతో ఓ మంచి కథతో వస్తే డేట్స్ ఇస్తానని దర్శకుడు క్రిష్కి మాటిచ్చేశారని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది.
దాంతో ప్రస్తుతం పవన్ కథ మీదే క్రిష్ పూర్తిగా దృష్టి పెట్టినట్లు చెప్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబుతో సినిమాకు 'ఓకే' అనిపించుకున్న క్రిష్కి పవర్ స్టార్ని కూడా డెరైక్ట్ చేసే అవకాశం దక్కించుకోవడం పరిశ్రమలో చర్చనీయాంశమైంది. త్రివిక్రమ్ తో చేస్తున్న చిత్రం అనంతరం ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాసం ఉంది. మహేష్ బాబుతో అనుకున్న సినిమా లేటయ్యేటట్లు ఉండటంతో ఈ ప్రాజెక్టుని ముందుగా తెరకెక్కించాలని క్రిష్ భావిస్తున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్... త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఫ్యాన్స్ హడావిడిలో పవన్ రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సినిమా సమ్మర్లో విడుదల చేయాలనుకుంటున్నట్లు ఇటీవలే నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రకటించారు. మరో ప్రక్క సంపత్నంది దర్శకత్వంలో పవన్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. క్రిష్ తోనే ముందు చేస్తారా లేక సంపత్ నందితో ముందుకు వెళ్తారా అనేది తేలాల్సి ఉంది.