twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ ని ప్రక్కన పెట్టి పవన్‌ కళ్యాణ్ తో నే?

    By Srikanya
    |

    హైదరాబాద్: పవన్ కళ్యాణ్ మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. దగ్గుపాటి రాణాతో 'కృష్ణంవందే జగద్గురుమ్' చిత్రం తెరకెక్కించిన క్రిష్ దర్శకత్వంలో చేయటానికి పవన్ ఓకే చేసారని తెలుస్తోంది. వివరాల్లోకెళితే... ఇటీవలే పవన్‌కల్యాణ్ 'కృష్ణంవందే జగద్గురుమ్' చూసి... ఆ సినిమా బాగా నచ్చడంతో ఓ మంచి కథతో వస్తే డేట్స్ ఇస్తానని దర్శకుడు క్రిష్‌కి మాటిచ్చేశారని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది.

    దాంతో ప్రస్తుతం పవన్ కథ మీదే క్రిష్ పూర్తిగా దృష్టి పెట్టినట్లు చెప్తున్నారు. ఇప్పటికే మహేష్‌ బాబుతో సినిమాకు 'ఓకే' అనిపించుకున్న క్రిష్‌కి పవర్‌ స్టార్‌ని కూడా డెరైక్ట్ చేసే అవకాశం దక్కించుకోవడం పరిశ్రమలో చర్చనీయాంశమైంది. త్రివిక్రమ్ తో చేస్తున్న చిత్రం అనంతరం ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాసం ఉంది. మహేష్ బాబుతో అనుకున్న సినిమా లేటయ్యేటట్లు ఉండటంతో ఈ ప్రాజెక్టుని ముందుగా తెరకెక్కించాలని క్రిష్ భావిస్తున్నారు.

    ప్రస్తుతం పవన్ కళ్యాణ్... త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఫ్యాన్స్ హడావిడిలో పవన్ రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమా సమ్మర్‌లో విడుదల చేయాలనుకుంటున్నట్లు ఇటీవలే నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ప్రకటించారు. మరో ప్రక్క సంపత్‌నంది దర్శకత్వంలో పవన్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. క్రిష్ తోనే ముందు చేస్తారా లేక సంపత్ నందితో ముందుకు వెళ్తారా అనేది తేలాల్సి ఉంది.

    English summary
    After the release of KVJ, Krish received another pleasant surprise from Pawan Kalyan for a film, which he would never be able to refuse. According to sources, Krish is also gearing up to frame a new storyboard for the Power star. Now the big question is that which one he would first embark on. Will it be Prince or Power Star?.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X