Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తప్పదు మరి..పవన్ సీక్రెట్ గా ఉంచాల్సిందే
హైదరాబాద్: బాలీవుడ్ సూపర్ హిట్ 'ఓ మై గాడ్' సినిమాకి రీమేక్ ఓ చిత్రాన్ని పవన్, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హైలెట్ గా నిలిచేది పవన్ లుక్ అనే సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ మోడ్రన్ శ్రీకృష్ణుడుగా కనిపించారు. ఇప్పుడా లుక్ కొద్దిపాటి మార్పులతో పవన్ తో చేయిస్తున్నారని సమాచారం. ఈ మేరకు సీక్రెట్ గా ఫొటో షూట్ జరిపారట. ఆ ఫోటో షూట్ లో రకరకాలుగా పవన్ గెపట్ లు ఛేంజ్ చేసారని తెలుస్తోంది. దాంతో వాటిని ఎట్టి పరిస్ధితుల్లోనూ బయిటరాకుండా చూడాలని పవన్ ఖచ్చితంగా చెప్పారట. సురేష్ బాబు ఆ భాధ్యతని తీసుకుని, తనతో పాటు ఆ ఫోటో షూట్ ఫొటోలను పట్టుకెళ్లారని సమాచారం. ఎంత రహస్యంగా ఉంచితే అంత క్రేజ్ వస్తుందనే సంగతి ...సినిమావాళ్లకు తెలిసినట్లుగా మరెవరికీ తెలియదేమో.
మొన్నటిదాకా పవన్ కల్యాణ్ అనగానే రాజకీయాలే గుర్తుకొచ్చేవి. ఎక్కడ చూసినా ఆయన ఆవేశపూరిత ప్రసంగాల గురించే మాట్లాడుకొనేవాళ్లు. ఎన్నికల క్రతువు ముగిసిందో లేదో మళ్లీ సినిమా వ్యవహారాల్లో బిజీ అయిపోయారు పవన్. గెడ్డంతోనే రాష్ట్రమంతా పర్యటించిన పవన్... ఎన్నికలు పూర్తవ్వగానే నున్నగా షేవ్ చేసుకొని పాత లుక్లోకి మారిపోయారు. సినిమా కోసమే ఆ మార్పు. వచ్చే నెలలోనే ఆయన కొత్త సినిమా సెట్స్పైకి వెళ్లబోతోంది.
వెంకటేష్తో కలిసి 'ఓ మై గాడ్' రీమేక్లో నటించబోతున్నారు. ఈ చిత్రానికి 'దేవ దేవమ్ భజే...' అనే పేరును ఖరారు చేసినట్టు సమాచారం. దేవుడి చుట్టూ సాగే కథ కావడంతో ఆ పేరైతేనే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోందట. పవన్ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాలోనూ దేవ దేవమ్ భజే... అంటూ ఓ పాట సాగుతుంది. అయితే ఈ టైటిల్ గురించి చిత్రబృందం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సివుంది.
అలాగే బాలీవుడ్ చిత్రాన్ని చాలా మార్చి తెలుగు నేటివిటికి తగినట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఒరిజనల్ లో ఉన్న పరేష్ రావెల్ పాత్ర కు ఇద్దరు పిల్లలు ఉంటే..ఇక్కడ వెంకటేష్ కి ఇద్దరు చెల్లెళ్లు ఉండేలా మార్చారని తెలుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ గెటప్ సైతం పూర్తి మార్పుతో ఉంటుందని,దానిపై కసరత్తు జరిగిందని చెప్తున్నారు. మొదట వెంకటేష్ తో షూటింగ్ మొదలు పెట్టి తర్వాత పవన్ తో ఫినిష్ చేస్తారు. ఈ మేరకు ప్రత్యేకమైన వీధి సెట్ ని వేసారు.
గతంలో నాగార్జున ...మోడ్రన్ దేముడుగా కృష్ణా అర్జున చిత్రంలో కనిపించి ఆకట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఆ సమస్య పవన్ కి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. అంతేకాకుండా పవన్ పాత్రను చాలా పెంచుతున్నారని అంటున్నారు. మరో ప్రక్క ఈ చిత్రానికి ఏం పేరు పెట్టే అవకాసముందే విషయమై మీడియాలో రకరకాల వార్తలు ప్రచారమవుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రానికి 'ఓరి దేముడా'అనే టైటిల్ పెట్టే అవకాసముందని చెప్తున్నారు. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేయటానికి నిర్ణయించారని ఫిల్మ్ సర్కిల్సో లో వినిపిస్తోంది.
పవన్ కల్యాణ్, వెంకటేష్ కలిసి నటిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. అది ఇప్పటికి కుదిరింది. బాలీవుడ్లో ఘన విజయం సాధించిన చిత్రం 'ఓ మై గాడ్'. 'మేన్ హూ స్యూడ్ గాడ్' అనే ఆంగ్ల చిత్రం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ రెండు చిత్రాల్ని స్ఫూర్తిగా తీసుకొని.. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ఇందులో బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ చేసిన శ్రీ కృష్ణుని పాత్రలో పవన్ కళ్యాణ్, పరేష్ రావల్ చేసిన ఓ సాధారణ వ్యాపారి పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారు. డాలీ ఈ చిత్రం డైరక్ట్ చేస్తారు.
కృష్ణుడు పాత్రకు ఎక్కువ సీన్స్ ఉండవు కాబట్టి గబ్బర్ సింగ్ 2 తో పాటు ఈ చిత్రమూ చేస్తాడని చెప్తున్నారు. వెంకటేష్ స్వయంగా పవన్ ని అడిగాడని అందుకే పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇఛ్చాడని అంటున్నారు. పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం 'ఓ మై గాడ్'. అక్షయ్ కుమార్ కూడా ఓ కీలక పాత్రలో నటించి నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించారు. ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించారు. 'కంజి విరుద్ధ్ కంజి' నాటకం ఈ చిత్రానికి ఆధారం.
'ఓ మై గాడ్'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.