Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
టెన్షన్ తగ్గించుకోవటానికే పవన్ ఆ నిర్ణయం?
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ మరో రీమేక్ కమిటయ్యాడని గత రెండు రోజులుగా మీడియాలో ఓ వార్త గుప్పు మంది. తమిళంలో అజిత్ హీరోగా వచ్చి హిట్టైన ‘వేదాళం' అది. అంతేనా ..ఈ రీమేక్ ని ఎన్టీఆర్ తో ‘రభస'చేసిన సంతోష్ శ్రీనివాస్ చేతిలో పెడుతున్నాడనీను. అయితే ఇది రూమర్ కాదు నిజమే అని పవన్ కు చెందిన కొందరు అంటున్నారు.
గతంలోనూ పవన్ రీమేక్ లు చేసి హిట్ కొట్టారు. దాంతో ఈ సారి మరో రీమేక్ అయితే కథ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదని పవన్ ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. తాజాగా చేస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ కోస ఆయన కలం పట్టి కథ,కథనం వండిన సంగతి తెలిసిందే.
ఈ నేపధ్యంలో రీమేక్ అయితే మన నేటివిటీ కు తగినట్లు మార్చుకుంటే సరిపోతుంది. అదీ సక్సెస్ ఫుల్ రీమేక్ అయితే దాదాపు అన్ని ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. అయితే పూర్తి నిర్ణయమైతే పవన్ తీసుకోలేదని అంటున్నారు.
అజిత్ నటించిన తమిళ చిత్రం ‘వేదాళం'...మాస్, యాక్షన్, కుటుంబ బంధాలు కలగలిపిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర మంచి విజయాన్ని అందుకొంది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తే ఎలా ఉంటుందా అని పవన్ ఆలోచిస్తున్నారు. ‘కందిరీగ'తో ఆకట్టుకొన్న సంతోష్పై నమ్మకంతో ఈ రీమేక్కి అతనికి అప్పగించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం మరికొద్ది రోజులు ఆగాలి.