Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పవన్ కళ్యాణ్కు మరోసారి దేవిశ్రీ మాస్ బీట్స్!
హైదరాబాద్: ఇటీవల జులాయి సినిమాతో హిట్ కొట్టిన త్రివిక్రమ్ తన తర్వాతి సినిమా పవన్ కళ్యాణ్తో చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈచిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
దేవిశ్రీ గతంలో పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన 'జల్సా' చిత్రంతో పాటు, గబ్బర్ సింగ్ చిత్రానికి, త్రివిక్రమ్ 'జులాయి' చిత్రాలకు సూపర్ హిట్ సంగీతాన్ని అందించారు. ఈ నేపథ్యంలో మరోసారి వీరి వీరి కాంబినేషన్ రీపీట్ అవుతున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. అదే నిజం అయితే పవన్ సినిమాలకు మూడో సారి సంగీతం అందించనున్నాడు దేవిశ్రీ.
ఈ చిత్రంలో పవన్ సరసన మలయాళ కుట్టి నిత్యా మీనన్ ను హీరోయిన్ గా తీసుకునే యోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇలియాన, అంజలి పేర్లు వినిపించినా....ఎవరూ ఖరారు కాలేదు. నిత్యా మీనన్ విషయంలో ఇంకా క్లారిటీ రానప్పటికీ ఆమెను ఖరారు చేయడం ఖాయమనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇంకా టైటిల్ ఖరారు కాని ఈచిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్నాడు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం అక్టోబర్లో మొదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా దీన్ని ప్లాన్ చేస్తుననట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లో వెల్లడి కానున్నాయి.