twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్‌కు మరోసారి దేవిశ్రీ మాస్ బీట్స్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఇటీవల జులాయి సినిమాతో హిట్ కొట్టిన త్రివిక్రమ్ తన తర్వాతి సినిమా పవన్ కళ్యాణ్‌తో చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈచిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

    దేవిశ్రీ గతంలో పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన 'జల్సా' చిత్రంతో పాటు, గబ్బర్ సింగ్ చిత్రానికి, త్రివిక్రమ్ 'జులాయి' చిత్రాలకు సూపర్ హిట్ సంగీతాన్ని అందించారు. ఈ నేపథ్యంలో మరోసారి వీరి వీరి కాంబినేషన్ రీపీట్ అవుతున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. అదే నిజం అయితే పవన్ సినిమాలకు మూడో సారి సంగీతం అందించనున్నాడు దేవిశ్రీ.

    ఈ చిత్రంలో పవన్ సరసన మలయాళ కుట్టి నిత్యా మీనన్ ను హీరోయిన్ గా తీసుకునే యోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇలియాన, అంజలి పేర్లు వినిపించినా....ఎవరూ ఖరారు కాలేదు. నిత్యా మీనన్ విషయంలో ఇంకా క్లారిటీ రానప్పటికీ ఆమెను ఖరారు చేయడం ఖాయమనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

    ఇంకా టైటిల్ ఖరారు కాని ఈచిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్నాడు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం అక్టోబర్లో మొదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా దీన్ని ప్లాన్ చేస్తుననట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లో వెల్లడి కానున్నాయి.

    English summary
    Pawan Kalyan, Trivikram Srinivas new movie. According to our sources, Devi Sri Prasad has been roped in as music director for this yet to be titled film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X