పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్తో పాన్ ఇండియా చిత్రం!.. ఇది వేరే లెవెల్ ప్లాన్..
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ గురించి ఇప్పట్లో వినడం లేదు కానీ అప్పట్లో ఆయన చేసిన ప్రతి మూవీ ఒక ప్రయోగం. క్రియేటివిటీకి మారుపేరైన కృష్ణవంశీ ఫ్యామిలీ సినిమాలకు పెట్టింది పేరు. సింధూరం లాంటి పవర్ఫుల్ ఎమోషనల్ సినిమా తెరకెక్కించిన, నిన్నే పెళ్లాడతా అని ఫ్యామిలీ డ్రామా రూపొందించడం ఆయన వల్లే సాధ్యం. సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్లోనే ఓ మైలు రాయిగా నిలిచిన మురారి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. దేశభక్తి నేపథ్యంతో తీసిన ఖడ్గం మూవీ సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు తర్వాత హీరోయిన్లను అంతా అందంగా చూపించే డైరెక్టర్ ఎవరు? అంటే అది కృష్ణవంశీనే అని చెబుతారు.
సింధూరం, నిన్నే పెళ్లాడతా, మురారి, ఖడ్గం వంటి సూపర్ హిట్లు అందుకున్న డైరెక్టర్ కృష్ణవంశీ శ్రీ ఆంజనేయం, మొగుడు, నక్షత్రం వంటి చిత్రాలతో ఓటమి చవిచూశారు. ఇలా చాలా కాలంగా వరుస పరాజయాలతో డీలా పడ్డ కృష్ణవంశీ సినిమాలకు గ్యాప్ తీసుకున్నారు.

మరాఠీ హిట్ సినిమా..
ప్రస్తుతం ఎలాగైనా హిట్ కొట్టాలన్న లక్ష్యంతో రంగమార్తాండ మూవీని తెరకెక్కిస్తున్నారు కృష్ణవంశీ. మరాఠీలో విడుదలై విజయవంతమైన నట సామ్రాట్ సినిమాకు ఇది రీమేక్గా రానుంది. సాధారణంగా కృష్ణవంశీ రీమేక్లపై అంతగా ఆసక్తి కనబరచరు.

సినిమాకు ఫిదా.. రీమేక్కు ఫిక్స్..
ఎప్పుడూ ఆయన సొంత కథలను నమ్మే సినిమాలు రూపొందిస్తారు. కానీ నట సామ్రాట్ చిత్రాన్ని వీక్షించిన ఆయన ఫిదా అయి రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యారని టాక్. నట సామ్రాట్ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్ ప్రధాన పాత్ర పోషించగా, తెలుగులో ప్రకాష్ రాజ్ చేస్తున్నారు.

కీలక పాత్రలో బ్రహ్మానందం..
అలాగే మరో ముఖ్య పాత్ర అయిన నానా పటేకర్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్గా మరాఠీలో విక్రమ్ గోఖలో నటించగా తెలుగులో బ్రహ్మానందాన్ని ఎంపిక చేశారట. సీరియస్గా ఎమోషనల్గా ఈ పాత్ర ఉంటుందట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది ఈ మూవీ.

ఫుడ్ మాఫియా నేపథ్యంలో..
త్వరలో ఈ మూవీ విడుదల కానుంది. అయితే దీని తర్వాత మరో సినిమా చేయనున్నారు కృష్ణవంశీ. ఇప్పటికే అన్నం అనే సినిమాను ప్రకటించారు. ఇది ఫుడ్ మాఫియా కథతో తెరకెక్కనుందట. దీంతో పాటు ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడట కృష్ణవంశీ.

పాన్ ఇండియాగా..
ఎప్పటి నుంచో తీయాలనుకుంటున్నా ఈ ప్రాజెక్ట్ను స్ట్రీమ్ లైన్ చేశారని సమాచారం. ఈ మూవీలో బుట్టబొమ్మ పూజా హెగ్డే, ఫిట్నెస్ సుందరి రకుల్ ప్రీత్ సింగ్లను హీరోయిన్లుగా తీసుకోనున్నారట. అలాగే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని కృష్ణవంశీ భావిస్తున్నట్లు సమాచారం.

బాలీవుడ్లో పాగా..
ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోయిన్లకు మంచి పాపులారిటే ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్లో అంతగా సినిమాలు తీయకపోయినప్పటికీ, బాలీవుడ్లో అనేక సినిమాలతో బిజీగా మారింది. ఇక బుట్టబొమ్మకు అల వైకుంఠపురం మూవీతో మంచి పాపులారిటీనే వచ్చింది.

త్వరలో ప్రకటన..
ఇటీవల రాధేశ్యామ్, బీస్ట్ మూవీస్ అంతగా విజయం సాధించకపోయినప్పటికీ ఆమె ఫాలోయింగ్కు ఏ మాత్రం తగ్గలేదనే చెప్పవచ్చు. పైగా వీరిద్దరూ బాలీవుడ్లో సినిమాలు చేస్తూ తమ ఉనికిని బాగానే కాపాడుకుంటున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడనుంది.


Click it and Unblock the Notifications











