Don't Miss!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వరుణ్ తేజ్ 'వాల్మీకి'కి చుక్కలు చూపిస్తున్న పూజా హెగ్డే.. 15 రోజులకు రెమ్యునరేషన్ ఎంతంటే!
క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోయిన్ గా మారిపోతోంది. నిర్మాతలు, దర్శకులు పూజా హెగ్డే జపం చేస్తున్నారు. ఒక లైలా కోసం చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన పూజా హెగ్డే ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. డీజే చిత్రం తర్వాత పూజా హెగ్డే మెరుపు వేగంతో దూసుకుపోతోంది. డీజే చిత్రం పరవాలేదనిపించగా ఆ తర్వాత విడుదలైన అరవింద సమేత మంచి విజయం సాధించింది. ప్రస్తుతం పూజా హెగ్డే మహేష్ సరసన నటించిన మహర్షి చిత్రం మే 9న విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రభాస్ కు జోడిగా మరో చిత్రంలో నటిస్తోంది. తాజాగా పూజా హెగ్డే మరో తెలుగు చిత్రానికి అంగీకారం తెలిపిందనే వార్తలు వస్తున్నాయి.
వాల్మీకిగా వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం వాల్మీకి. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరక్కుతోంది తమిళ హిట్ మూవీ జిగర్తాండకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ లుక్ కి సంబంధించిన ఫోటోలు ఇటీవల లీకై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గుబురు గడ్డం, పొడవుగా పెరిగిన హెయిర్ తో వరుణ్ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ ఆ మొదట డెబ్యూ నటిని తీసుకోవాలని భావించారు. కానీ దర్శకుడు హరీష్ శంకర్ మనసు మార్చుకుని పూజా హెగ్డే అయితే బావుంటుందని భావిస్తున్నాడట.
15 రోజులకు అంతా
ఈ చిత్రంలో పూజాహెగ్డే పాత్రకు సంబంధించిన షూటింగ్ కేవలం 15 రోజులు మాత్రమే ఉంటుందట. అయినా కూడా పూజా హెగ్డే తన రెమ్యునరేషన్ తో నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందట. ఈ చిత్రం కోసం పూజ హెగ్డే 2 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూజా హెగ్డేకు కుర్రకారులో ఉన్న క్రేజ్ తో ఆమెకు అడినంత పుచ్చుకునేందుకు నిర్మాతలు సిద్ధం అయ్యారట.
డీజే చిత్రానికే
డీజే చిత్రం ముందు వరకు పూజా హెగ్డేకు సరైన సక్సెస్ లేదు. కానీ ఆ చిత్రానికే పూజా హెగ్డే నిర్మాత దిల్ రాజుని కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. చివరకు దిల్ రాజు 75 లక్షలకు ఒప్పించారు. అరవింద సామెత చిత్రానికి కోటికి పైగానే పారితోషికం అందుకుందట. ఆ వెంటనే మహేష్ సరసన నటించే ఛాన్స్ కూడా దక్కించుకుంది. ప్రస్తుతం పూజా హెగ్డే ఏ చిత్రనికైనా 2 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని వినికిడి.
14 రీల్స్ నిర్మాణంలో
వాల్మీకి చిత్రాన్ని 14 రీల్స్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. పూజా హెగ్డే ఈ చిత్రంలో నటించనుండడంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలో విడుదల కానున్న మహర్షి చిత్రం విజయం సాధిస్తే పూజా హెగ్డే క్రేజ్ మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు.