Don't Miss!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మరోసారి మహేష్తో రొమాన్స్.. రెడీ అవుతున్న పూజా హెగ్డే.. ఏకంగా ముగ్గురు!
హీరోయిన్ పూజాహెగ్డే.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. వరుసపెట్టి స్టార్ హీరోల సరసన నటిస్తూ ఒక్కసారిగా స్టార్ స్టేటస్ పట్టేసింది. ఇటీవలే వరుణ్ తేజ్ సరసన గద్దలకొండ గణేష్ సినిమాలో నటించి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈమె.. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ఓ సినిమాలో, అలాగే ప్రభాస్ సరసన మరో సినిమాలో నటిస్తోంది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు మహేష్ బాబు కొత్త సినిమా 'సరిలేరు నీకెవ్వరు'లో కూడా పూజా కనిపించనుందని తెలుస్తోంది.
గతంలో మహేష్ 25వ సినిమా మహర్షిలో మహేష్ బాబుతో జోడీ కట్టి బాగా ఆకట్టుకుంది పూజా. ఈ జోడీ సిల్వర్ స్క్రీన్ రొమాన్స్ చూసి మహేష్ అభిమానులు మురిసిపోయారు. దీంతో ఇది గమనించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. పూజా హెగ్డేతో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ఓ పాట చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారట.
ఇప్పటికే ఈ సినిమాలో ప్రత్యేక గీతం కోసం తమన్నాను తీసుకున్నారు. మరో పాట కోసం పూజాను తీసుకోబోతున్నారట. అంటే తమన్నా, పూజా హెగ్డే, రష్మిక మందన్న ఇలా ముగ్గురు భామలతో 'సరిలేరు నీకెవ్వరు'లో మహేష్ రొమాన్స్ చూడబోతున్నామని స్పష్టమవుతోంది.
మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి రూపొందుతోంది 'సరిలేరు నీకెవ్వరు' సినిమా. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. విజయశాంతి ముఖ్య పాత్ర పోషిస్తోంది. కలర్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.