Don't Miss!
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పూజా హెగ్డే చిందులు.. రంకెలట.. అందాలభామకు ‘సాక్ష్యం’ మంట!
దువ్వాడ జగన్నాథంలో హాట్ హాట్గా అందాలను ఆరబోయడంతో గ్లామర్ క్వీన్ పూజా హెగ్డేను టాలీవుడ్లో భారీ ఆఫర్లు చుట్టుముట్టాయి. దాంతో కెరీర్ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకొంటున్నారు. కానీ ఇటీవల నటించిన చిత్రం సాక్ష్యం నిరాశజనకంగా మారడంతో ఆమె తన మేనేజర్, పీఆర్ బృందంపై రంకెలు వేశారట. పూజా హెగ్డే కోపానికి కారణంగా పేర్కొంటున్న విషయాలు ఇవే..
డీజే తర్వాత వచ్చిన ఆఫర్తో
పూజా హెగ్డే 2014లోనే ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ రావడానికి రెండేళ్లు పట్టింది. అల్లు అర్జున్తో నటించిన దువ్వాడ జగన్నాథంతో టాలీవుడ్లో స్థిరమైన కెరీర్ ఏర్పడింది. దాంతో మెల్లగా మంచి చిత్రాల ఎంపికపై దృష్టిసారించింది. అలాంటి సమయంలోనే సాక్ష్యం సినిమా ఆఫర్ ముందుకు వచ్చిందట.
Recommended Video
సాక్ష్యం ఆఫర్ను పూజా రిజెక్ట్
సాక్ష్యంలో సౌందర్య లహరి పాత్ర ఆఫర్ను తన టీమ్ ముందుకు తీసుకురాగా తొలుత నిరాకరించారట. అయితే చాలా మంచి కథ, అందులో పాత్ర కూడా బాగుంటుంది అని తన పీఆర్ టీమ్ నచ్చచెప్పి ఆఫర్ను ఒప్పుకునేలా చేశారట. బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన నటించడానికి పూజా హెగ్డేకు భారీ రెమ్యునరేషన్ ముట్టుందనే వార్త ప్రచారమైన సంగతి తెలిసిందే.
సాక్ష్యం ఫ్లాప్తో
తాజాగా రిలీజైన సాక్ష్యం సినిమాకు డిజాస్టర్ అనే టాక్ వినిపిస్తున్నది. సుమారు రూ.40 కోట్లతో మంచి వీఎఫ్ఎక్స్ సాంకేతికతతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందనే మాట వినిపిస్తున్నది. ఇలాంటి సినిమాను ఎందుకు అంటగట్టారని అంశంతో పూజా హెగ్డే తన టీమ్పై మండిపడ్డారట.
పూజా హెగ్డే వార్నింగ్
పూజా హెగ్డే తన టీమ్ను గట్టిగా మందలించడమే కాకుండా ఇలాంటి సినిమాలను తన ముందుకు తీసుకురావొద్దని చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారట. ఏదైనా సినిమా ఆఫర్ వస్తే అది నా కెరీర్కు ప్లస్ అయ్యేలా ఉండాలని చెప్పారట. దాంతో పీఆర్ టీమ్కు దిమ్మ తిరిగినంత పనైందనేది సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి.
టాప్ సూపర్స్టార్లతో ఆఫర్లు
డీజే తర్వాత పూజ హెగ్డే కెరీర్ గ్రాఫ్ అనూహ్యంగా పెరిగిపోయింది. వంశీ పైడిపల్లి రూపొందించే మహేష్బాబు చిత్రంలో, అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తీస్తున్న అరవింద సమేత చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్నది. అలాగే ప్రభాస్ కొత్త చిత్రంలో కూడా ఆఫర్ను కొట్టేసినట్టు సమాచారం. ఇలా స్టార్ హీరోలతో ఆఫర్ల దక్కించుకొంటున్న సమయంలో సాక్ష్యం చిత్రం పరాజయం పొందడం పూజా హెగ్డేకు నిరాశ కలిగించే అంశమే.