Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఇడియట్ హీరోతో కలిసి మళ్ళీ పనిచేయటానకి పూరీ జగన్ ప్లాన్స్
పూరీ జగన్నాధ్, రవితేజ కెరీర్ ల రెండింటినీ డిసైడ్ చేసి నిలబెట్టిన చిత్రం ఏదంటే ఇడియట్ అనే ఎవరైనా కళ్ళు మూసుకుచెపుతారు. ఆ తర్వాతే రవితేజ కు ఎన్నిహిట్స్ వచ్చి హీరోగా నిలబడ్డా,పూరీ పోకిరి లాంటి సినిమాలను డైరక్ట్ చేసినా అంటారు.అయితే ఈ ఇద్దరూ నేనింతే వంటి మెగా ప్లాఫ్ చిత్రం తర్వాత కలిసి పనిచేయలేదు.పూరీ వరసగా ప్లాఫ్స్ ఇచ్చుకుంటూ రికార్డ్స్ క్రియేట్ చేస్తూంటే,రవితేజ తన మార్కట్ ని పెంచుకుంటూ వరస సినిమాలు చేసేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తన్నారు.
అయితే ఇప్పుడు మళ్ళి వీరిద్దరూ కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.తనకు ఇడియట్ తో లైఫ్ ఇచ్చిన దర్శకుడుకి మళ్ళీ హిట్ ఇచ్చి ప్లాపుల్లోంచి బయిటకు తీయాలని రవితేజ ఈ ఆఫర్ తో పూరీ కలిసి ప్రపోజల్ పెట్టినట్లు సమాచారం. గతంలో రవితేజతో పెద్ద హిట్ ఇచ్చిన నిర్మాణ సంస్ధ ఈ కాంబినేషన్ ని క్యాష్ చేసుకోవటానికి పావులు కదుపుతోందని చెప్తున్నారు.కథ ఇడియట్ కి సీక్వెల్ గా ఉంటుందంటున్నారు.అదీ సంగతి.