twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోసానికి మరో తలనొప్పి

    By Staff
    |

    Posani Krishna Murali
    ప్రజారాజ్యం తరుపున పోటీ చేసిన ఓడిపోయిన పోసాని టైమ్ అస్సలు బాగోలేదు. ఫైనాన్సియల్ గానూ దెబ్బతిన్న పోసాని రాజా వారి చేపల చెరువు సైతం గట్టెంక్కించలేకపోయింది. అప్పటికీ చేపల చెరువు ఫరవాలేదనిపించుకున్నా మెంటల్ కృష్ణ దెబ్బకు ఎవరూ ధియోటర్ల వైపుకు తొంగిచూడటం లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు గాలి శీను పేరుతో మరో చిత్రం పోసాని ని హైలెట్ చేస్తూ ట్రైలెర్స్ వస్తున్నాయి. అందులో పోసాని ఎమ్మల్యేగా నటించారు. కామిడి ట్రాక్ అనుకుని చేసిన ఈ సీన్స్ నే హైలెట్ చేస్తూ పబ్లిసిటీ చేయటం పోసానికి మింగుడు పడటం లేదు. అందులోనూ ఆ సినిమా గతంలో వచ్చిన ఎఫ్.ఎమ్.(ఫన్ అవుర్ మస్తీ) అనే హిందీ చిత్రానికి డబ్బింగ్ వెర్షన్.

    ఇక ఈ గాలి శీను చిత్రం ఉటోపియా సమర్పణలో స్పప్నమూవీస్‌ పతాకంపై సి.ఉదయభాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్‌.కె.ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, సత్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ముమైత్‌ఖాన్‌ ఓ ఐటం సాంగ్ లో చేయనుంది.నా పేరే మధుబాల' అంటూ సాగే పాటను శ్రీలేఖ పాడగా మ్యూజిక్‌ ఐ థియేటర్‌లో రికార్డింగ్‌ చేసారు. అయితే పోసానికి ఈ విషయం ముందే చెప్పి సీన్స్ తీసామని కాబట్టి తమకేమీ సమస్య ఉండదని దర్శక,నిర్మాతలు ధీమాగా ఉన్నారు. ఇక పోసాని అటు ఓడిపోయినందుకు బాద పడాలా లేక ఎమ్మేల్యేగా చేసిన కొద్ది పాటి సీన్స్ ని మరొకరు క్యాష్ చేసుకున్నందుకు బాధ పడాలా అనే సంగిద్గంలో ఉన్నట్లు తెలుస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X