twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాసరిని దుమ్మెత్తుతూ పోసాని

    By Staff
    |

    Posani Krishna Murali
    తాజాగా చిరంజీవిని సెటైర్ చేస్తూ దాసరి మేస్త్రి అనే చిత్రాన్ని రూపొందించారు. దానికి ప్రతిగా ప్రజారాజ్యం పోసాని తయారు చేస్తున్న రాజావారి చేపలచెరువులో దాసరి పై పూర్తి సెటైర్స్ వేయనున్నాడని సమాచారం. అప్పటికీ పోసాని ఓ ప్రెవేట్ టీవీ ఛానెల్ లో దాసరిని దుమ్ముదులుపుతూ నానా బూతులు తిట్టాడు. అయినా కసి తీరక ఇప్పుడు ఆయన గతాన్ని, ఎదిగిన వైనాన్ని, తనదైన స్టైల్ లో విమర్శించచబోతున్నాడని విశ్వసనీయ సమాచారం.

    ఇక పోసాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు రామోజీ ఫిలిం సిటిలో శరవేగంతో జరుగుతున్నాయి. ఈ చిత్రం కథ గురించి పోసాని శాసన సభ పుట్టిన దగ్గర నుంచి దానికి ఎన్నికయిన ఎందరెందరో నాయకులు ప్రజలకు రకరకాలుగా వాగ్దానాలు చేసి చట్ట సభలలోకి అడుగుపెడుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా ఆ వాగ్దానాలను అమలు చేసిన వారెవరూ లేరు. ప్రజలను తమ మాటలతో వంచిస్తున్న రాజకీయనాయకుల గురించి, రాజకీయాల గురించి ఈ సినిమాలో చర్చిస్తున్నాం అన్నారు.

    రాజకీయాలలో సేవకులే కానీ నాయకులు ఉండరు, ప్రజలనే నాయకులు అని ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఇందులో నేను పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాను. ఆ ఉద్యోగం నుంచి తొలగిస్తే చేపల చెరువు పెట్టుకుని మీడియా సహకారంతో అన్యాయాలను ప్రతిఘటించే పాత్ర ఇది అని చెప్తున్నారు. అయితే ప్రత్యేకంగా ఒక పార్టీని కానీ, వ్యక్తులను కానీ విమర్శించే విధంగా చిత్రం ఉండదని చెప్పుతున్నారు. దాసరి కూడా అలాగే చెప్పి సినిమా తీసారు. కానీ చివరకు చిరంజీవిపై డైరక్టుగా విమర్శలు గుప్పించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X