Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సెక్స్ స్కామ్స్ టార్గెట్గా.. పోసాని సినిమా
సంచలనమైన అంశాలను, కుళ్లు రాజకీయాలను తన సినిమాల్లో చూపిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు పోసాని కృష్ణమురళి. 'దుశ్శాసన" తర్వాత పోసాని మరో ప్రాజెక్టు మొదలు పెట్టలేదు. అలా అని ఆయన ఖాళీగా కూర్చున్నాడనుకుంటే పొరపాటే. పోసాని మరో ఆసక్తి కరమైన అంశంతో పోలీసుల ముందుకు రాబోతున్నారు. ఇందు కోసం చాలా కాలంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు.
పోసాని సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఆయన గత కొంత కాలంగా దేశంలో, రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న సెక్స్ స్కాంలు, సెల్రబిటీల మధ్య ఉన్న అక్రమ సంబంధాలు తదితర అంశాలను బేస్ చేసుకుని కథను తయారు చేసుకుంటున్నారని తెలిసింది. నిత్యానంద, ఎన్డీ తివారి, అంబటి రాంబాబు, ఎబిఎన్ రాధాకృష్ణ, ఎపి చరణ్ తదిరులను పోలిన పాత్రల చుట్టూ ఈ కథ తిరుగుతుందట.
వాస్తవంగా జరిగిన అంశాలు కావడంతో ఈ సినిమా ప్రేక్షఃకుల్లో ఆసక్తిని రేకెత్తించేదిగా ఉంటుందని, ఆపరేషన్ దుర్యోధన తర్వాత పెద్ద హిట్లు లేని పోసాని, ఈ సినిమా ద్వారా మరోసారి తన సినిమా పవర్ ఏమిటో చూపించడానికి సిద్ధం అవుతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.