Don't Miss!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పవన్ ‘పంజా’లో మరో పంచ్ డైలాగ్..!?
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'పంజా"లో నుంచి అంటూ మరో డైలాగు నెట్ లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే...పండించే రైతు విసిరేది గింజ...సమాజంలో చీడ పురుగులను ఏరి పారేయటానికి నేను వేసేదే ఈ పంజా. అలాగే ఇంతకు ముందు 'నా స్పీడ్ కు మా అన్నయ్యే అడ్డు వేయలేక పోయాడు...ఇక మీరేంటిరా వేసేది"అంటూ మరో డైలాగ్ ఇంతకు ముందు వినపడింది. అలాగే పవన్ కళ్యాణ్ పంజా చిత్రానికి తమిళ సూపర్ స్టార్ అజిత్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. అయితే అది తమిళ వెర్షన్ కి మాత్రమే. అక్కడ విష్ణువర్ధన్ దర్శకత్వంలో గతంలో భిళ్లా చిత్రంలో అజిత్ చేసి ఉన్నాడు. అందుకే ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు కానూ అజిత్ వాయిస్ ని వాడుకుంటున్నారు. ఇక తెలుగులో ఎవరు వాయిస్ ఓవర్ ఇస్తారన్నది మాత్రం ఇంకా ఫైనలైజ్ కాలేదు. పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎదురుచూస్తున్న చిత్రం పంజా. తమిళ దర్శకుడు విష్ణువర్దన్ దర్సకత్వంలో ముస్తాబై వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ తొమ్మిదవ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక పంజా ఆడియోని నవంబర్ రెండో వారంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం విడుదల సమయానికే నాగార్జున రాజన్న కూడా విడుదల అవుతుంది. ఇక క్లాష్ రాకుండా రెండు చిత్రాల విడుదల తేదీలు గ్యాప్ ఉండేటట్లు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పంజా చిత్రం షూటింగ్ రామోజి ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
పవన్ కళ్యాణ్, అడవి శేషు, అంజలీ మీద ఓ పబ్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో బెల్లీ డాన్స్ స్పెషల్ గా ఉండబోతోంది. ఈ పాట పూర్తైన తర్వాత ఆడియోకి డేట్ ఫిక్స్ చేస్తారు. బిల్లా వంటి కమర్షియల్ ఎంటర్టైనర్ను అందించిన తమిళ దర్శకుడు విష్ణువర్థన్ తెలుగు తెరపై సంధిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ఇది. నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ ఈ చిత్రానికి నిర్మాతలు. విజయదశమి పండగ సందర్భంగా సినిమా టైటిల్ (పంజా)తో పాటు హీరో ఫస్ట్లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో అతని పేరు జాక్సన్ రాబర్ట్ అని తెలుస్తోంది. ఈ పాత్ర ఓ మాఫియా డాన్ ది కావటంతో ఆ పాత్ర పేరును పవన్ ఫిక్స్ చేసారు. సారాజేన్ డయాస్, అంజలీ లావానియాహీరోయిన్స్ గా చేస్తున్నారు.నిర్మాతలు నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ మాట్లాడుతూ ..పవన్ ఇమేజ్ దృష్ట్యా పవర్ఫుల్ టైటిల్ నిర్ణయించాం. కోల్కత నేపథ్యంలోని యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. న్యూలుక్ ఉన్న సినిమా. క్రిష్, త్రీఇడియట్స్..చిత్రాలకు స్టంట్స్ కూర్చిన శ్యామ్ కౌశల్ అద్భుత యాక్షన్నిచ్చారు. 2పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర పనులు నడుస్తున్నాయి అన్నారు.