Don't Miss!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రభాస్ క్రేజీ అప్డేట్: సింగిల్ టేక్లో రెబల్ స్టార్.. ఆ ఒక్క సీన్ కోసమే అంతనా!
ఇటీవలే 'సాహో' డిజాస్టర్ ఖాతాలో వేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన తాజా సినిమాను జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ ప్రభాస్ అభిమానుల్లో ఆనందం నింపుతోంది.
పీరియాడికల్ లవ్స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం చిత్ర షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. ఈ సినిమాపై అటు ప్రభాస్, ఇటు రాధాకృష్ణ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. అనుకున్నది అనుకున్నట్లుగా రావాలని సినిమా షూటింగ్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.
అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో ఓ యాక్షన్ సీన్ కోసం 2 కోట్ల రూపాయలతో భారీగా మార్కెట్ సెట్ వేశారని తెలిసింది. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ తన 150 మంది అసిస్టెంట్స్తో పదిరోజుల పాటు కష్టపడి మార్కెట్ సెట్ను వేశారని సమాచారం. ఈ సెట్లో ఓ ఛేజింగ్ సీన్ షూట్ చేశారట. అందులో ప్రభాస్ ఓ కిలోమీటర్ పాటు పరిగెత్తి సింగిల్ టేక్లో ఆ సన్నివేశాన్ని పూర్తి చేశారట.
ఈ సినిమాకు మొదట 'జాను' అనే టైటిల్ అనుకున్నప్పటికీ ఆ తర్వాత.. 'ఓ డియర్' అనే టైటిల్ ఫిక్స్ చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. యూవీ క్రియేషన్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నారట.