Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
ప్రభాస్ క్రేజీ అప్డేట్: సింగిల్ టేక్లో రెబల్ స్టార్.. ఆ ఒక్క సీన్ కోసమే అంతనా!
ఇటీవలే 'సాహో' డిజాస్టర్ ఖాతాలో వేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన తాజా సినిమాను జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ ప్రభాస్ అభిమానుల్లో ఆనందం నింపుతోంది.
పీరియాడికల్ లవ్స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం చిత్ర షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. ఈ సినిమాపై అటు ప్రభాస్, ఇటు రాధాకృష్ణ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. అనుకున్నది అనుకున్నట్లుగా రావాలని సినిమా షూటింగ్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.
అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో ఓ యాక్షన్ సీన్ కోసం 2 కోట్ల రూపాయలతో భారీగా మార్కెట్ సెట్ వేశారని తెలిసింది. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ తన 150 మంది అసిస్టెంట్స్తో పదిరోజుల పాటు కష్టపడి మార్కెట్ సెట్ను వేశారని సమాచారం. ఈ సెట్లో ఓ ఛేజింగ్ సీన్ షూట్ చేశారట. అందులో ప్రభాస్ ఓ కిలోమీటర్ పాటు పరిగెత్తి సింగిల్ టేక్లో ఆ సన్నివేశాన్ని పూర్తి చేశారట.
ఈ సినిమాకు మొదట 'జాను' అనే టైటిల్ అనుకున్నప్పటికీ ఆ తర్వాత.. 'ఓ డియర్' అనే టైటిల్ ఫిక్స్ చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. యూవీ క్రియేషన్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నారట.