twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్ర‌భాస్ క్రేజీ అప్‌డేట్: సింగిల్ టేక్‌లో రెబల్ స్టార్.. ఆ ఒక్క సీన్ కోసమే అంతనా!

    |

    ఇటీవలే 'సాహో' డిజాస్టర్ ఖాతాలో వేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన తాజా సినిమాను జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ ప్రభాస్ అభిమానుల్లో ఆనందం నింపుతోంది.

    పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్ర‌స్తుతం చిత్ర షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. ఈ సినిమాపై అటు ప్రభాస్, ఇటు రాధాకృష్ణ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. అనుకున్నది అనుకున్నట్లుగా రావాలని సినిమా షూటింగ్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.

    Prabhas 20: Crazy Update for RebelStar Fans

    అయితే తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో ఓ యాక్ష‌న్ సీన్ కోసం 2 కోట్ల‌ రూపాయలతో భారీగా మార్కెట్ సెట్‌ వేశార‌ని తెలిసింది. ఆర్ట్ డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్ త‌న 150 మంది అసిస్టెంట్స్‌తో ప‌దిరోజుల పాటు క‌ష్ట‌ప‌డి మార్కెట్ సెట్‌ను వేశార‌ని సమాచారం. ఈ సెట్‌లో ఓ ఛేజింగ్‌ సీన్ షూట్ చేశారట. అందులో ప్రభాస్ ఓ కిలోమీట‌ర్ పాటు ప‌రిగెత్తి సింగిల్ టేక్‌లో ఆ సన్నివేశాన్ని పూర్తి చేశారట.

    ఈ సినిమాకు మొదట 'జాను' అనే టైటిల్ అనుకున్నప్పటికీ ఆ తర్వాత.. 'ఓ డియర్' అనే టైటిల్ ఫిక్స్ చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. యూవీ క్రియేషన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను ద‌స‌రా కానుకగా విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌.

    English summary
    Prabhas recent release Saaho, directed by Sujeeth, failed to live up to everyone's expectation. After Saaho, the actor is now concentrating on his upcoming film which is directed by Radhakrishna. In this movie Prabhas playing intresting role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X