Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రభాస్ రెడీ.. ప్లాన్ ఇదే.. 2020లో యంగ్ రెబల్ స్టార్ స్కెచ్!
ఇటీవలే భారీ సినిమా 'సాహో'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఆయన అభిమానులకు నిరాశే మిగిల్చారు. ప్రభాస్ కెరీర్లో 'బాహుబలి' లాంటి భారీ సినిమా తర్వాత ఊహించని డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఆ లోటు పూడ్చుకోవాలని తన తర్వాతి సినిమా (జాన్)తో అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు ప్రభాస్. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికర అప్డేట్ తెలిసింది. వివరాల్లోకి పోతే..
ప్రభాస్ కెరీర్లో 20వ సినిమా
ప్రభాస్ కెరీర్లో 20వ సినిమాగా 'జాన్' ప్రేక్షకుల ముందుకు రానుంది. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే కొంతమేర షూటింగ్ కంప్లీట్ చేసుకుందని, కానీ మధ్యలో కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్కు బ్రేక్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం మేరకు తిరిగి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మోడ్ లోకి వచ్చి శరవేగంగా షూటింగ్ జరుపుకోనుందని తెలుస్తోంది.
సరికొత్తగా ప్రభాస్ మేకోవర్.. రెడీ
ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ని వేదిక చేసుకుందట ప్రభాస్ టీమ్. అక్కడ వేసిన భారీ సెట్లో మరో రెండు మూడు రోజుల్లో చిత్రంలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుందట. ఇందుకోసం ప్రభాస్ సరికొత్తగా మేకోవర్ అయి రెడీగా ఉన్నారని టాక్.
స్క్రిప్ట్ మొదలుకొని లొకేషన్స్ వరకు అన్నీ.. ప్లాన్ ఇదే
ఇక ఈ సినిమాను తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సాహో డిజాస్టర్ మరిపించేలా ఈ సినిమా ఉండాలని చూస్తున్నారట. ఈ మేరకు స్క్రిప్ట్ మొదలుకొని లొకేషన్స్, నటీనటులు అన్నిన్నిటిలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా సమాచారం.
భారీ బడ్జెట్.. యూరప్ బ్యాక్డ్రాప్
ఇక ఈ చిత్రానికి దాదాపుగా 180 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. 1960 కాలం నాటి కథతో యూరప్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. అందుకే భారీ ఎత్తున దాదాపు 25 రకాల సెట్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సెట్స్పై ప్రభాస్ యాక్షన్ ఎపిసోడ్స్ కనీవినీ ఎరుగని రీతిలో ఉంటాయట.
ప్రభాస్ రోల్.. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్
యూవీ క్రియేషన్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాకు గిభ్రాన్ సంగీతం సమకూర్చుతున్నారు. చిత్రంలో ప్రభాస్ సరసన యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో హస్త సాముద్రికం తెలిసిన వ్యక్తిగా ప్రభాస్ కనిపించనున్నాడని ఫిలిం నగర్ టాక్. ఈ సినిమా కోసం ప్రభాస్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఈ 2020లో ప్రభాస్ 20తో ఎలా మ్యాజిక్ చేస్తాడో!.