Don't Miss!
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Prabhas25: ఆరోజున ఫ్యాన్స్కు ప్రభాస్ సర్ప్రైజ్.. ఇండియాలోనే టాప్ డైరెక్టర్తో సినిమా
సీనియర్ హీరో కృష్ణంరాజు కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్గా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఆరంభంలో తెలుగులో మాత్రమే సినిమాలు చేసిన అతడు.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' తర్వాత నుంచి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అంతేకాదు, ఏక కాలంలో వరుసగా అన్నీ భారీ సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోన్న ప్రభాస్.. తన 25వ సినిమాను సైతం లైన్లో పెట్టుకున్నాడని ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన ప్రకటనపైనా ఓ వార్త వైరల్ అవుతోంది. ఆ వివరాలు మీకోసం!
తొలిసారి అలాంటి పాత్రలో ప్రభాస్
ప్రస్తుతం ప్రభాస్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రమే 'రాధే శ్యామ్'. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, ఈ మూవీలో ప్రభాస్ రొమాంటిక్ రోల్లో నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.
అరాచకమైన డ్రెస్తో రెచ్చిపోయిన దిశా పటానీ: వామ్మో అందాలు మొత్తం కనిపించేంత దారుణంగా!
అన్నీ మొదలు... ముందు వీటితోనే
'రాధే శ్యామ్' షూటింగ్ జరుగుతుండగానే ప్రభాస్.. నాగ్ అశ్విన్ తెరకెక్కించబోయే సినిమాను ప్రకటించాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్పై అశ్వనీదత్ దీన్ని నిర్మిస్తున్నారు. దీని తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' అనే హిందీ చిత్రాన్ని, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' అనే మూవీ ప్రకటించాడు. కానీ, దాని కంటే ముందే ఈ రెండు చిత్రాలను ప్రారంభించాడు.
పాన్ వరల్డ్ రేంజ్.. అదే కాన్సెప్టుతో
నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ చేసే మూవీ పాన్ వరల్డ్ రేంజ్లో రూపొందనుంది. ఇందులో అమితాబ్ కీలక పాత్రను పోషిస్తుండగా.. దీపిక పదుకొనే హీరోయిన్గా చేస్తోంది. ఇక, సినిమా టైం మెషీన్ ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కబోతుందనే టాక్ వినిపించింది. దీంతో బాలయ్య నటించిన 'ఆదిత్య 369'కు ఇది సీక్వెల్ అంటున్నారు. ఇది వచ్చే ఏడాది మొదలు కానుంది.
షర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ సరయు: బ్రాతో ఘాటు ఫోజులిస్తూ.. వామ్మో చూస్తే తట్టుకోలేరు
24వ సినిమా ఆ బాలీవుడ్ డైరెక్టర్తో
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ జోష్తో కనిపిస్తున్నాడు. ఇప్పటికే పలు చిత్రాలను మొదలు పెట్టిన ఈ స్టార్ హీరో.. తన 24వ సినిమాను కూడా లైన్లో పెట్టుకున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీన్ని బాలీవుడ్ డైరెక్టర్ 'వార్' ఫేం సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రాబోతుందని తెలిసింది.
ప్రభాస్ 25వ సినిమా ప్రకటన డేట్
కొంత కాలంగా ఫుల్ ఫామ్తో కనిపిస్తోన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. సినిమా మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తన 25వ సినిమాను కూడా ఫిక్స్ చేసుకున్నాడని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన అక్టోబర్ 7న వెలువడనుందని తెలిసింది.
ChaySam Divorce: పెళ్లికి ముందే సమంత చైతూ మధ్య ఒప్పందం.. విడిపోయిన తర్వాత అలా చేయకూడదంటూ!
25వ సినిమా కోసం స్పెషల్ కాన్సెప్ట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించే 25వ సినిమాను స్పెషల్గా రూపొందించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఎక్కడా రాని కాన్సెప్టుతో ఈ మూవీ తెరకెక్కనుందట. ఇందులో ప్రభాస్ పాత్ర కూడా ఎంతో కొత్తగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కోసం స్టోరీ లైన్ కూడా రెడీ అయిపోయిందని అంటున్నారు. దీంతో ఈ ప్రాజెక్టుపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి.
Recommended Video
దేశమే గర్వించే దర్శకుడితో మూవీ
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించబోయే 25వ సినిమాను ఇండియాలోనే టాప్ డైరెక్టర్ తెరకెక్కిస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయట. ఇక, ఈ మూవీ 2024లో ప్రారంభం అవుతుందని కూడా ఓ టాక్ వినిపిస్తోంది. అంటే 7వ తేదీ వరకూ ఆగితే మొత్తం తెలుస్తుంది.