Don't Miss!
- News కడపలో వైఎస్ షర్మిలకు ప్లస్ గా వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ లేఖాస్త్రం!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కరణ్ జోహార్కి షాక్ ఇచ్చిన ప్రభాస్.. మరో స్టార్ హీరోతో భారీ మల్టీస్టారర్!
బాహుబలి తరువాత నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తో ఒక్క సినిమా అయినా చేయాలని బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్స్ చాలానే ట్రై చేస్తున్నాయి. అయితే ప్రభాస్ మాత్రం కేవలం తనకు కథ నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక త్వరలో బాలీవుడ్ లో ప్రభాస్ ఒక భారీ మల్టీస్టారర్ కథలో కనిపించనున్నట్లు గత కొంత కాలం నుంచి టాక్ వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్ త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలపై ఒక లుక్కేస్తే..
డైరెక్ట్ బాలీవుడ్ సినిమా..
రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఇప్పుడు నార్త్ ఆడియెన్స్ కి కూడా ఒక రెగ్యులర్ బాలీవుడ్ హీరోలా మారిపోయాడు. సాహో సినిమా ఓపెనింగ్స్ తో పాటు అక్కడ వచ్చిన పాజిటివ్ టాక్ మరెక్కడా రాలేదు. అందుకే ప్రభాస్ హిందీ మార్కెట్ ని ఏ మాత్రం మిస్ చేసుకోకుండా అక్కడి ప్రొడక్షన్ హౌజ్ లలో డైరెక్ట్ తెలుగు సినిమాను ప్లాన్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అందుకే అక్కడి స్టార్ ప్రొడ్యూసర్స్ ప్రభాస్ కోసం నిత్యం ఏదో ఒక ఆఫర్ తీసుకొస్తూనే ఉన్నారు.
కరణ్ జోహార్ కి షాక్..
ముందుగా ప్రభాస్ కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ లోనే ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. ఎందుకంటే బాహుబలి విజయంలో కరణ్ పాత్ర చాలానే ఉంది. బాలీవుడ్ లో బాహుబలి క్లిక్కవ్వడానికి కారణం ఆయనే. అందుకే ఒక సినిమా చేయాలని అనుకున్నారు. కానీ ప్రభాస్ ని సంతృప్తి పరిచే కథలను ఆయన సెట్ చేయలేకపోయాడు. అయితే ఇంకా కొత్త కథలను వెతుకుతున్న సమయంలో ప్రభాస్ కరణ్ కి ఉహీంచని విధంగా షాక్ ఇచ్చాడు.
గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్
బాలీవుడ్ లో మరో అగ్ర నిర్మాణ సంస్థగా కొనసాగుతున్న యష్ రాజ్ ఫిల్మ్స్ కి ప్రభాస్ ఆల్ మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగులో రాధే శ్యామ్ తో పాటు నాగ్ అశ్విన్ తో ఒక సినిమా చేస్తున్న ప్రభాస్ చాలా బిజీ అయ్యాడు. ఇక నెక్స్ట్ కరణ్ జోహార్ తోనే చేయాలని అనుకున్నప్పటికి ప్లాన్ సెట్టవ్వలేదు. దీంతో యష్ రాజ్ నుంచి వచ్చిన భారీ మల్టీస్టారర్ కథకు ప్రభాస్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఆ హీరోతోనే మల్టీస్టారర్
యష్ రాజ్ ఫిల్మ్స్ త్వరలో 50వ వార్షికోత్సవం పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగానే నిర్మాత యష్ చోప్రా ఇండియన్ బిగెస్ట్ మల్టీస్టారర్ పాన్ ఇండియా సినిమాను రూపొందించాలని అనుకుంటున్నారు. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ పై స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నారు. ఇక అందుకోసం ప్రభాస్, హృతిక్ రోషన్ ని సెలెక్ట్ చేసుకున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. వీరి కలయికలో ధూమ్ 4 కూడా రావచ్చని టాక్ వచ్చింది. ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.