Don't Miss!
- News ఉండి టీడీపీలో వార్ - మారుతున్న లెక్కలు, ఆడియో వైరల్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హృతిక్, ఆమిర్ తర్వాత ప్రభాసే: బాలీవుడ్లోకి యంగ్ రెబెల్ స్టార్.. రూ. 1000 కోట్లతో సినిమా
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మాంచి ఊపు మీద ఉన్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' తర్వాత వచ్చిన క్రేజ్ను సద్వినియోగం చేసుకునే పనిలో అతడు బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల విడుదలైన తన సినిమా 'సాహో'ను హిందీలో కూడా విడుదల చేశాడు. అక్కడ ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో బాలీవుడ్పై బాగా దృష్టి సారించాడని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడంటూ ఓ వార్త బయటకు వచ్చింది. అది కూడా సూపర్ హిట్ సిరీస్ ద్వారా అని అంటున్నారు. ఇంతకీ ఏంటా సినిమా?
Recommended Video
ఈ రెండింటి వల్ల పెరిగిన ప్రభాస్ స్టామినా
‘బాహుబలి' ‘సాహో' సినిమాల వల్ల యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ స్టామినా అమాంతం పెరిగిపోయింది. అప్పటి వరకు తెలుగులో మాత్రమే అభిమానులను సంపాదించుకున్న ఈ స్టార్ హీరో.. రెండు సినిమాలతో దేశ వ్యాప్తంగా ఫ్యాన్ బేస్ను ఏర్పరచుకున్నాడు. అందుకే ‘సాహో'కు నెగెటివ్ టాక్ వచ్చినా.. భారీ వసూళ్లను రాబట్టిందన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
వాళ్లందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది
బాలీవుడ్లో స్ట్రయిట్గా రిలీజ్ అయిన స్టార్ హీరోల సినిమాలను మించి ‘సాహో' కలెక్షన్ల సాధించుకుంది. దీంతో బీ టౌన్లోని చాలా మంది ప్రముఖులకు మైండ్ బ్లాక్ అయిపోయిందని ఆ మధ్య టాక్ వినిపించింది. ఆ సినిమాను ఆడనీయకుండా ప్రయత్నాలు కూడా చేసిన వాళ్లు నోరెళ్లబెట్టేశారని గుసగుసలు వినిపించాయి.
బడా నిర్మాణ సంస్థ దృష్టికి ప్రభాస్
బాలీవుడ్లోనే కాకుండా ఇండియాలోనే బడా నిర్మాణ సంస్థగా పేరొందింది యష్ రాజ్ ఫిలిమ్స్. ఈ సంస్థ ఎన్నో భారీ సినిమాలను తెరకెక్కించింది. భవిష్యత్లో కూడా పలు చిత్రాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ సంస్థ ప్రభాస్తో సినిమా చేయడానికి చర్చలు జరిపినట్లు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఇది టాలీవడ్, బాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది.
1000 కోట్ల బడ్జెట్ సినిమా సంతకం
ప్రభాస్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బయటకు వచ్చిన వార్తతో దీనికి బలం చేకూరుతోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించే ఈ సినిమాను రూ. 1000 కోట్లతో తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఈ సినిమా ఏంటా అని అనుకుంటున్నారా..? ఇదే మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ ‘ధూమ్ 4'.
ఈ ఫ్రాంచైజీ సూపర్ హిట్
‘ధూమ్' సిరీస్లో వచ్చిన మూడు సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఈ నాలుగో భాగంలో మరో స్టార్ హీరోను నటింపజేయాలని యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం సల్మాన్ ఖాన్, షారుఖ్, రణబీర్ కపూర్, అక్షయ్ లాంటి స్టార్లను అనుకున్నారు. కానీ, వాళ్లెవరూ దీనిని చేయనని చెప్పేశారని టాక్.
హృతిక్, ఆమిర్ తర్వాత ప్రభాసే
‘ధూమ్' మొదటి భాగంలో అభిషేక్ బచ్చన్తో పాటు జాన్ అబ్రహం నటించాడు. అలాగే, రెండో భాగంలో హృతిక్, మూడో పార్టులో ఆమిర్ ఖాన్ నటించి మెప్పించారు. ఇప్పుడు ప్రభాస్ ఈ సినిమా చేస్తే బడా హీరోల తర్వాత ఛాన్స్ పట్టేసిన వాడు అవుతాడు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి యంగ్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.