Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ప్రభాస్ రావడం వెనక చిరంజీవిపై కోపం ఉందట!
హైదరాబాద్: వరుణ్తేజ్, దిశాపటాని హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లోఫర్' చిత్ర ఆడియో వేడుక డిసెంబర్ 7న జరగనుంది. ఈ వేడుకకు ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారట. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా వస్తాడని అనుకున్నప్పటికీ ప్రభాస్ను ఆహ్వానించాడు పూరి.
150వ సినిమా అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి తనను కాదన్నందుకు పూరి కోపంగా ఉన్నారని.... ఆ కారణంగానే చిరంజీవిని పిలవడం ఇష్టం లేక ప్రభాస్ను చీఫ్ గెస్టుగా పిలిచాడనే ప్రచారం జరుగుతోంది. చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ నుండి ఎవరినీ పిలవడం లేదు పూరి. అయితే ఈ చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేసారు. చిరంజీవిగారు ఈ సినిమా కోసం వీడియో బైట్ ఇచ్చారని, దాన్ని ఆడియో వేడుకలో ప్రదర్శిస్తామని తెలిపారు.
లోఫర్ చిత్రాన్ని 18 డిసెంబర్ న విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు తేదీ ని లాక్ చేసినట్లు సమచారం. ఈ చిత్రంలో రేవతి, పోసాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్కు ఇంటర్నెట్లో విశేష స్పందన లభిస్తోంది. వరుణ్ తేజ్ హీరోగా ఇటీవల విడుదలైన 'కంచె' చిత్రం బాక్సాఫీసు వద్ద డీసెంట్ హిట్టయింది. ఈ నేపథ్యంలో లోఫర్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ సినిమాకు లోఫర్ అని టైటిల్ పెట్టడంపై పూరి స్పందిస్తూ...కథలో భాగంగానే ఆ పేరు పెట్టాం. ఇందులో కథానాయకుడికి పనీ పాట ఏమీ ఉండదు. కానీ చివరికి మంచివాడిలా మారతాడు. ఈ పేరు ఎందుకు పెట్టామో సినిమా చూశాక బాగా అర్థమవుతుంది అని తెలిపారు.