Don't Miss!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Prabhas మరో బిగ్ బడ్జెట్ సినిమాను వాయిదా.... తప్పట్లేదు!
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద బాహుబలి రేంజ్ లో రికార్డులు క్రియేట్ అయ్యేలా ఉన్నాయని అర్ధమవుతోంది. ఒకదానికి మించి మరొక సినిమాను సెట్ చేసుకుంటున్నాడు. ఇక ప్రభాస్ ఎన్ని సినిమాలు ఒకే చేసినా కూడా అందరి చూపు ఎక్కువగా సైన్స్ ఫిక్షన్ సినిమాపైనే ఉంది. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించబోయే ఆ సినిమాను వైజయంతి ప్రొడక్షన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనుంది.
గత ఏడాది నుంచి కూడా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను హాలీవుడ్ లో కూడా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఇంతకుముందు ఎవ్వరు చూడని సరికొత్త టైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలోనే కథను అల్లినట్లు టాక్ అయితే వస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి మరికొంత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం షూటింగ్స్ కు బ్రేక్ పడడంతో ప్రభాస్ డేట్స్ అన్ని కూడా తారుమారయ్యాయి. సలార్ తో పాటు ఆదిపురుష్ ను ఒకేసారి ఫినిష్ చేయాలని అనుకుంటే ఇప్పుడు డేట్స్ క్లాష్ అవుతున్నాయి. అందుకే నాగ్ అశ్విన్ సినిమాను మరో మూడు నెలల వరకు వాయిదా వేయవచ్చని టాక్ వస్తోంది. అంటే సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో స్టార్ట్ కావచ్చని సమాచారం. ఇక ముందుగా సలార్ ను పూర్తి చెయ్యాలని ప్రభాస్ ఒక టార్గెట్ అయితే సెట్ చేసుకున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కానున్న విషయం తెలిసిందే.