twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఏక్ థా టైగర్’ తెలుగు రీమేక్ లో ప్రభాస్?

    By Bojja Kumar
    |

    ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా నటించిన 'ఏక్ థా టైగర్' చిత్రం యారేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ భారీ ఓపెనింగ్స్ సాధిస్తూ దూసుకెలుతోంది. ఇప్పటికే ఈ చిత్రం 5 రోజుల్లో 100 కోట్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా 'ఏక్ థా టైగర్' గురించి ఆసక్తికరమైన విషయం టాలీవుడ్లో వినిపిస్తోంది.

    'ఏక్ థా టైగర్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి కొందరు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారని, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా మార్పులు చేసి తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ప్రభాస్ అయితే కరెక్ట్ గా సరిపోతాడని, దాదాపు అతనే ఖాయం అయ్యే అవకాశం ఉందంటున్నారు.

    కాగా...ప్రభాస్ ప్రస్తుతం లారెన్స్ దర్శకత్వంలో 'రెబల్' చిత్రం చేస్తున్నారు. తమన్నా, దీక్ష సేథ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్లో విడుదల కానుంది. మరో వైపు వారధి చిత్రం షూటింగులో కూడా పాల్గొంటున్నాడు. వారధి షూటింగ్ దాదాపు 75 శాతం పూర్తయింది. ఇందులో ప్రభాస్ సరసన అనుష్క, రీచా నటిస్తున్నారు. వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొరటాల శివ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

    వీటి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. చారిత్రక నేపథ్యంలో సాగే ఈ మూవీలో ప్రభాస్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నాడు.

    English summary
    It is heard that the chances of remaking the Ek Tha Tiger in Telugu is looking high and few Tollywood big producers are busy trying to see if the rights can be bought. Another source has revealed that if the remake plans go through then the chances of Prabhas stepping into Salman’s shoes look high.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X