Don't Miss!
- Sports DC vs SRH:ట్రావిస్ హెడ్, షెహ్బాజ్ అహ్మద్ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
‘ఏక్ థా టైగర్’ తెలుగు రీమేక్ లో ప్రభాస్?
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా నటించిన 'ఏక్ థా టైగర్' చిత్రం యారేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ భారీ ఓపెనింగ్స్ సాధిస్తూ దూసుకెలుతోంది. ఇప్పటికే ఈ చిత్రం 5 రోజుల్లో 100 కోట్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా 'ఏక్ థా టైగర్' గురించి ఆసక్తికరమైన విషయం టాలీవుడ్లో వినిపిస్తోంది.
'ఏక్ థా టైగర్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి కొందరు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారని, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా మార్పులు చేసి తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ప్రభాస్ అయితే కరెక్ట్ గా సరిపోతాడని, దాదాపు అతనే ఖాయం అయ్యే అవకాశం ఉందంటున్నారు.
కాగా...ప్రభాస్ ప్రస్తుతం లారెన్స్ దర్శకత్వంలో 'రెబల్' చిత్రం చేస్తున్నారు. తమన్నా, దీక్ష సేథ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్లో విడుదల కానుంది. మరో వైపు వారధి చిత్రం షూటింగులో కూడా పాల్గొంటున్నాడు. వారధి షూటింగ్ దాదాపు 75 శాతం పూర్తయింది. ఇందులో ప్రభాస్ సరసన అనుష్క, రీచా నటిస్తున్నారు. వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొరటాల శివ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
వీటి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. చారిత్రక నేపథ్యంలో సాగే ఈ మూవీలో ప్రభాస్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నాడు.