Don't Miss!
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- News రాజీనామాకు సిద్దం - కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
సల్మాన్ ఖాన్ బిజినెస్.. అదే ఫాలో అవుతున్న ప్రభాస్.. ఆ డేట్ కోసం వెయిటింగ్?
కరోనా దెబ్బ కొట్టిన తరువాత సినిమాల బిజినెస్ మొత్తం మారిపోయింది. బడ్జెట్, మార్కెట్ స్థాయి గట్టిగానే పెరిగినప్పటికి కరోనా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందనేది ఎవరికి అర్థం కావడం లేదు. జనాల మైండ్ సెట్ కూడా చాలా మారిపోయింది. ఏ సినిమా ఓటీటీలో హిట్టవుతుందో ఏ సినిమా థియేటర్ లో సక్సెస్ అవుతుందో అర్థం కావటం లేదు. ఇక అందుకే ప్రభాస్ ఈ సారి సల్మాన్ ఖాయం ప్లాన్ ను ఫాలో అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
బాహుబలి తరువాత..
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో తన స్తాయిని ఏ రేంజ్ లో పెంచుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమా అనంతరం స్పీడ్ గా సినిమాలు పూర్తి చేయాలని అనుకున్నాడు. కానీ పాన్ ఇండియా స్థాయి పెరగడంతో ప్రతి సినిమాకు దాదాపు రెండేళ్ల సమయం తీసుకున్నాడు.
చెప్పిన డేట్ కు వస్తుందా లేదా?
నిజానికి రాధేశ్యామ్ సినిమాను తొందరగానే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ సినిమా దర్శక నిర్మాతల అర్థం లేని ప్లానింగ్ వల్లే ఆలస్యం అయ్యిందని రూమర్స్ వచ్చాయి. దానికితోడు కరోనా కూడా అడ్డు పడింది. ఇక సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేసినప్పటికి చెప్పిన డేట్ కు వస్తుందా లేదా అనేది అనుమానమే.
ఒకేసారి ఓటీటీ, థియేటర్స్ లో
యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న రాధేశ్యామ్ సినిమాను జూలై 30న విడుదల చేయాలని చూస్తున్నారు. కానీ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. ఇక సినిమా బిజినెస్ పై ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఒకేసారి ఓటీటీ, థియేటర్స్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
సల్మాన్ ఖాన్ బిజినెస్.. అదే ఫాలో అవుతారా?
ఇటీవల జీ సంస్థ సల్మాన్ ఖాన్ రాధే సర్వ హక్కులను కొనేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాను ఒకేరోజు ఓటీటీ, థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. ఓటీటీలో 'పే పర్ వ్యూ' లెక్కన 249రూపాయలకు ధరను ఫిక్స్ చేశారు. ఇక ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాకు కూడా అలాంటి ఆఫర్స్ వస్తున్నాయట. కానీ నిర్మాతలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. రాధే 13న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా బిజినెస్ ను బట్టి ఒక నిర్ణయానికి రావచ్చని తెలుస్తోంది.