Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ప్రభాస్ అభిమానులకు శుభవార్త: రాధాకృష్ణ ఇలా ఫిక్స్ చేసేశారు!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన తాజా సినిమాను జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ ప్రభాస్ అభిమానుల్లో ఆనందం నింపుతోంది. వివరాల్లోకి పోతే..
'సాహో' డిజాస్టర్.. అభిమానుల ఆశలు
బాహుబలి సినిమాతో భారీ హిట్ ఖాతాలో వేసుకున్న ప్రభాస్.. ఆ తర్వాత 'సాహో' సినిమా ద్వారా ఆశించిన ఫలితం రాబట్టలేక పోయాడు. దీంతో నిరాశ చెందిన యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ మేరకు రాధాకృష్ణ సైతం ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు.
ప్రభాస్ 20.. టైటిల్ ఇదే
ప్రభాస్ కెరీర్ లో 20వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మొదట 'జాను' అనే టైటిల్ అనుకున్నప్పటికీ ఆ తర్వాత.. 'ఓ డియర్', 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ పరిశీలనలో పెట్టారు. ఈ రెండిటిలో ఓ టైటిల్ ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట డైరెక్టర్ రాధాకృష్ణ.
పూజా హెగ్డేతో రొమాన్స్.. ప్రభాస్ పాత్ర
యూవీ క్రియేషన్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోందని, ఇందులో ప్రభాస్ పాత్ర గతంలో ఎన్నడూ చూసని విధంగా ఉంటుందని తెలుస్తోంది.
రిలీజ్ డేట్ ఫిక్స్..
భారీ హంగులతో రూపొందుతున్న ఈ సినిమాను దసరా సీజన్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట దర్శక నిర్మాతలు. ఈ మేరకు అక్టోబర్ 16ను విడుదల తేదీగా లాక్ చేశారని సమాచారం. త్వరలోనే అధికారికంగా ఈ తేదీని ప్రకటించనున్నారని లేటెస్ట్ అప్డేట్.
డైరెక్టర్ రాధాకృష్ణ డిసీజన్.. అభిమానుల సంబరాలు
నిజానికి ఈ సినిమాను 2021లో విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూపులను దృష్టిలో పెట్టుకొని ఇలా దసరా కానుకగా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట డైరెక్టర్ రాధాకృష్ణ. ఇందులో నిజానిజాల సంగతి అటుంచితే ఈ వార్త మాత్రం ప్రభాస్ అభిమానుల్లో జోష్ నింపుతోంది.