Don't Miss!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పాన్ ఇండియా దర్శకుడి కోసం పోటీ పడుతున్న ఎన్టీఆర్, ప్రభాస్.. ?
పాన్ ఇండియా సినిమా అనగానే ఇప్పుడు ఎక్కువగా మన హీరోలే గుర్తుకు వస్తున్నారు. మొన్నటివరకు 100కోట్ల బడ్జెట్ అనగానే బాలీవుడ్ హీరోలు మాత్రమే గుర్తుకు వచ్చే వారు. కానీ ఎప్పుడైతే బాహుబలి వచ్చిందో అప్పటి నుంచి బాలీవుడ్ కి ధీటుగా మన హీరోలు అడుగులు వేస్తున్నారు. ఇక ప్రభాస్ తరువాత టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎక్కువగా పాన్ ఇండియా కథలపైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్న తారక్ తప్పకుండా బాలీవుడ్ లో ఒక బలమైన ముద్ర వేస్తాడని చెప్పవచ్చు. త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాను కూడా పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు అనే రూమర్స్ అయితే వచ్చాయి. కానీ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా ఆ విషయాన్ని నమ్మలేము. ఇక మరోవైపు ప్రశాంత్ నీల్ తో కూడా తారక్ గత కొన్ని నెలలుగా చర్చలు జరుపుతున్నాడు.
ఇక మరోవైపు ప్రభాస్ కూడా ప్రశాంత్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నట్లు టాక్. అతను డైరెక్ట్ చేస్తున్న KGF 2 అయిపోగానే సినిమాను ఎనౌన్స్ చేయించాలని చూస్తున్నారు. ప్రశాంత్ అయితే ఇద్దరు స్టార్ హీరోలను లైన్ లో పెట్టాడు గాని ముందు ఎవరితో వర్క్ చేస్తాడు అనే విషయంలో బిగ్ కన్ఫ్యూజన్ ఏర్పడింది. ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ కథతో పాటు రామాయణ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఆది పురుష్ సినిమాను చేయనున్నాడు. మరి ప్రశాంత్ సినిమాను ఎప్పుడు లైన్ లోకి తెస్తాడో చూడాలి.