Just In
- 34 min ago
ప్రియుడితో జ్వాలా గుత్తా కెమిస్ట్రీతో కేక.. బికినీలో ఆమె.. సిక్స్ప్యాక్తో అతను.. హాట్ హాట్గా
- 54 min ago
విదేశీ భామతో రాంచరణ్ రొమాన్స్.. అదరగొట్టేలా శంకర్ ప్యాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్
- 2 hrs ago
డెలివరీ సమయంలో అలాంటి పరిస్థితి.. కన్నీరు పెట్టించిన మధుమిత-శివ బాలాజీ
- 2 hrs ago
రాజేంద్రప్రసాద్ నటించిన క్లైమాక్స్ సెన్సార్ పూర్తి... మార్చి 5న రిలీజ్!
Don't Miss!
- News
స్నేహితుడి తల్లిపై కన్ను.. కోరిక తీర్చమని వేధింపులు, తిరగబడటంతో దాడి
- Sports
India vs England: 'టీమిండియాలో ఎందుకు లేవని ప్రశ్నించేవాళ్లు.. ఆ మాటలు నిత్యం గుర్తుకొచ్చేవి'
- Finance
ఏడాదిన్నరలో రూపాయి దారుణ పతనం, ఏకంగా 104 పైసలు డౌన్
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ముంబైకి వెళ్లనున్న ప్రభాస్.. అందుకోసమే అంటూ ప్రచారం
బాహుబలి 1, బాహుబలి 2, సాహో లాంటి సినిమాలు ప్రభాస్ ఇమేజ్ను అమాంతం పెంచేశాయి. బాహుబలి సినిమాలతో ప్యాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్.. సాహో లాంటి డబ్బింగ్ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ను ఊపేశాడు. ఇక నేరుగా బాలీవుడ్ చిత్రం చేస్తే.. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అలాంటి ఓ వార్తే ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
ప్రభాస్ ప్రస్తుతం జాన్ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన కొంత పార్ట్ను షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగానే ప్రభాస్ బాలీవుడ్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. దీని కోసం ముంబై వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

డబ్బింగ్ చిత్రాలతోనే ఇప్పటివరకూ హిందీ ప్రేక్షకుల్ని పలకరించిన ప్రభాస్ ఇకపై నేరుగా హిందీ సినిమాలోనే నటించనున్నారనే వార్త ఫుల్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ చిత్రం కోసం ప్రభాస్ ముంబై వెళ్లబోతున్నాడు. అక్కడ కరణ్ జోహార్ ని కలవబోతున్నాడు అంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే డార్లింగ్ రెడీ అంటే సినిమా చేయడానికి కరణ్ జోహార్ సహా పలువురు బాలీవుడ్ దర్శకనిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉత్కంఠ కనిపిస్తోంది.
ప్రభాస్ కోసం ఇప్పటికే ఇద్దరు ముగ్గురు దర్శకులు క్యూలో ఉన్నారు. వీళ్లలో సురేందర్ రెడ్డి.. కేజీఎఫ్ ప్రశాంత్ నీల్.. గీత గోవిందం పరశురామ్ ఫ్రంట్ రన్నర్స్ గా ఉన్నారని ప్రచారమవుతోంది. అయితే ఆ ముగ్గురిలో ప్రభాస్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారోనన్న ఉత్కంఠ ప్రభాస్ అభిమానుల్లో ఉంది.సురేందర్ రెడ్డి ఇప్పటికే ప్రభాస్ కోసం ఓ స్క్రిప్టు సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం ఉంది. మరి ప్రభాస్ 21 ఎవరితో ఉంటుంది? సురేందర్ రెడ్డితోనా.. లేక కరణ్ జోహార్ తోనా? లేక ఇంకెవరితో అన్నది తేలాల్సి ఉంది.