Don't Miss!
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
అల్లు అర్జున్ టైటిల్ తో ప్రభాస్ చిత్రం
ప్రభాస్ హీరోగా రచయిత నుంచి దర్శకుడుగా మారిన కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్ వారధి అని పెట్టినట్లు సమాచారం. ఈ వారధి టైటిల్ ని మొదట అల్లు అర్జున్ పరుగు చిత్రానికి అనుకున్నారు. అయితే టైటిల్ క్యాచీగా ఉండాలని మార్చి పరుగు అని పెట్టారు. ఇప్పుడు అదే టైటిల్ ని ప్రభాస్ చిత్రానికి వాడుతున్నారు. ఇక వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా వి.వి.క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మాణమవుతోంది. ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో హీరో ప్రభాస్ పాత్ర తీరుతెన్నులు వైవిధ్యభరితంగా ఉండటమే కాక గెటప్ కూడా వినూత్నంగా ఉంటుంది.
ఇదివరకెన్నడూ చూడని విధంగా ప్రభాస్ కనిపిస్తారు. నవంబర్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ని ప్రారంభిస్తాం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనుండగా, ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు ప్రభాస్ సరసన నటిస్తున్నారని తెలిపారు. దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ- 'ప్రభాస్ ఇమేజ్కి ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని తెలిపారు. ఇక కొరటాల శివ గతంలో బృందావనం, ఊసరవెల్లి చిత్రాలకు రచన చేసారు. అందులోని డైలాగులు బాగా పేరు తెచ్చుకున్న సంగతి కూడా తెలిసిందే.