Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Prabhas కొత్త సినిమా కోసం మారుతి పర్ఫెక్ట్ ప్లాన్.. ఫైనల్ గా స్టార్ట్ అయ్యేది అప్పుడే!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా ఫ్యాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు హఠాత్తుగా మరణించడంతో ఒక్కసారిగా మళ్లీ ప్రభాస్ స్లో కావాల్సి వచ్చింది. పెదనాన్న మరణంతో కాస్త గ్యాప్ తీసుకున్న ప్రభాస్ మళ్ళీ సినిమా నిర్మాతలపై భారం పడకూడదు అని ఆలోచించే షూటింగ్స్ మొదలు పెట్టేందుకు డిసైడ్ అయ్యాడు. ఇక ప్రస్తుతం అయితే సలార్ సినిమా సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే.
అలాగే ఆదిపురుష్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చివరి దశలో ఉంది. మరోవైపు ప్రాజెక్ట్ K కూడా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ప్రభాస్ ఇంతకుముందే మారుతీ దర్శకత్వంలో ఒక సినిమాను మొదలు పెట్టాలని అనుకున్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్టు దాదాపు స్టార్ట్ అయ్యింది అని అనుకునే లోపే అనుకోకుండా మరొక బ్రేక్ పడింది. ఇచ్చిన మాట ప్రకారం ప్రభాస్ మారుతితో సినిమా చేయాలి అని ఆలోచనతోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రభాస్ మీద నమ్మకంతో దర్శకుడు మారుతి కూడా పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ అయితే సిద్ధం చేసుకుంటున్నాడు.
దాదాపు ఆ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. ఇక రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాడు. కానీ ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలని ప్రభాస్ బిజీగా ఉన్నాడు. దీంతో మారుతి సినిమా షూటింగ్ నవంబర్లో మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు. కానీ అప్పుడు కూడా ప్రభాస్ ఖాళీగా ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. కావున అప్పుడే సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా సినిమా కాబట్టి ప్రభాస్ దేశవ్యాప్తంగా సినిమాను ప్రమోట్ చేసే బాధ్యతను తీసుకున్నాడు. అయితే ఈ క్రమంలో మారుతీ దర్శకత్వంలో కొత్త సినిమాను అప్పుడు స్టార్ట్ చేయకపోవచ్చట. ఏదేమైనా కూడా మారుతి పూర్తి ప్రణాళిక సిద్ధం చేసుకున్న తర్వాత ఏదో ఒక విధంగా బ్రేక్ పడుతూనే ఉంది. ఇక ఫైనల్ గా ప్రాజెక్టును వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.