Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ఆ డైరెక్టర్ ప్రభాస్కే సూటి పెట్టారట.. అందుకే ఇంతకాలం సైలెంట్ అయ్యారా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ క్యాచ్ చేసుకునేలా ఆ డైరెక్టర్ ఓ ఆసక్తికర కథాంశం సిద్ధం చేశారట. కాస్త లేట్ అయినా సరే.. లేటెస్ట్గా వద్దాం, టాలెంట్ ఏంటో మరోసారి చూపిద్దాం అన్నట్లుగా ఆ దర్శకుడు ఇన్నాళ్లు వెయిట్ చేశారని టాక్ నడుస్తోంది. ఇంతకీ ఎవరా డైరెక్టర్? అనే కదా మీ ఆలోచన. అక్కడికే వచ్చేద్దాం.
అతనే డైరెక్టర్ పరశురామ్. తనదైన స్టైల్ సినిమాలు తీస్తూ ఆడియన్స్ మనసు దోచుకున్న ఈయన గత కొంతకాలంగా సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండతో 'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా రూపొందించిన డైరెక్టర్ పరశురామ్, ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. చిన్న సినిమా గానే వచ్చి గీత గోవిందం వంద కోట్లు కొల్లగొట్టింది. అయినప్పటికీ ఆ తర్వాత పరశురామ్ మార్క్ కనిపించలేదు.
దీంతో ఈయనకు ఎవ్వరూ అవకాశాలు ఇవ్వడం లేదని అనుకున్నారంతా. కానీ అసలు విషయం అదికాదని తెలుస్తోంది. కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకొని ప్రభాస్ కోసం బలమైన కథ రాసేందుకే ఆయన ఇన్నాళ్లు సమయం కేటాయించాడని, ఇక ఆ కథను ప్రభాస్ చెవిలో వేసేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం. సినీ వర్గాల సమాచారం మేరకు కొద్ది రోజుల్లోనే ప్రభాస్కు పరశురామ్ కథ చెప్పబోతున్నాడట. చూడాలి మరి పరశురామ్ కథ విని ప్రభాస్ ఎలా రియాక్ట్ అవుతాడా? అనేది.