Don't Miss!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
ప్రభాస్లో అసంతృప్తి.. సాహో టీంకు షాకిస్తున్న వార్తలు!
Recommended Video
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి చిత్రంతో ప్రభాస్కు నేషనల్ లెవల్లో క్రేజ్ ఏర్పడింది. టాలీవుడ్లో బాలీవుడ్ హీరోలకు ధీటైన మార్కెట్ ఉన్న నటుడు ప్రభాస్ ఎదిగాడు. అందుకే ప్రభాస్ క్రేజ్ని దృష్టిలో ఉంచుకుని సాహో నిర్మాతలు 200 కోట్ల భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ అందాల తార శ్రద్దా కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. సాహోపై తాజాగా వస్తున్న వార్తలు చిత్ర యూనిట్ కు షాక్ ఇచ్చే విధంగా ఉన్నాయి.
300 కోట్ల బడ్జెట్
బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం కూడా భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ సంస్థ 300 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత భారీ బడ్జెట్ లో తెరకెక్కే చిత్రంపై అదే స్థాయిలో అభిమానుల్లో అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలని అందుకోవాలంటే చిత్రాన్ని పర్ఫెక్ట్ గా తెరకెక్కించాలి. ప్రస్తుతం ఈ విషయంలోనే ప్రభాస్ అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన కొన్ని సన్నివేశాల విషయంలో ప్రభాస్ హ్యాపీగా లేడట.
ఆ సన్నివేశాలపై అసంతృప్తి
అబుదాబిలో చిత్ర యూనిట్ కొన్ని ఛేజింగ్ సన్నివేశాలని చిత్రీకరించింది. మరికొన్ని యాక్షన్ సన్నివేశాల్ని కూడా అక్కడ షూట్ చేశారు. ఈ సన్నివేశాల పట్ల ప్రభాస్ అసంతృప్తి వ్యక్తం చేశాడని, రీ షూట్ చేయాలని దర్శకుడిని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ సన్నివేశాల విషయంలో ప్రభాస్ కొన్ని మార్పులు సూచించినట్లు తెలుస్తోంది.
వాయిదా పడుతుందా
ప్రభాస్ సూచించినట్లు చిత్ర యూనిట్ రీ షూట్ కోసం అబుదాబి వెళితే సాహో విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 15న విడుదల చేయడానికి నిర్మాతలు ఇప్పటికే నిర్ణయించారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే మరికొన్ని వారాల్లోనే సాహో షూటింగ్ మొత్తం పూర్తి కావాల్సి ఉంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని ప్రారంభించడానికి చిత్ర యూనిట్ సిద్ధం అవుతోంది.
విజువల్ ఎఫెక్ట్స్
టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సాహో చిత్రంలో కళ్ళు చెదిరేలా విజువల్స్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ విన్యాసాలతో పాటు విజువల్స్ ఎఫెక్ట్స్ అబ్బురపరుస్తాయట. ఇక రీ షూట్ గురించి వస్తున్న వార్తలపై చిత్ర యూనిట్ స్పందించలేదు. ప్రభాస్ సరసన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటిస్తోంది.