Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాలీవుడ్లో అర్జున్ రెడ్డి దర్శకుడికి చుక్కెదురు.. ప్రభాస్కి చెప్పడంతో!
టాలీవుడ్లో మొదటి సినిమాతోనే సత్తా చాటారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. 'అర్జున్ రెడ్డి' రూపంలో ప్రేక్షకలోకానికి ఓ డిఫెరెంట్ మూవీ పరిచయం చేసి సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత అదే సినిమాను బాలీవుడ్ లో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి భారీ వసూళ్లు రాబట్టాడు. దీంతో అతితక్కువ కాలంలో టాలీవుడ్ టు బాలీవుడ్ అందరికీ సుపరిచితమయ్యారు సందీప్.
ఈ నేపథ్యంలో తన తర్వాతి సినిమాను కూడా బాలీవడ్ లోనే తీయాలని డిసైడ్ అయిన సందీప్ రెడ్డి వంగా.. రణ్ బీర్ కపూర్ కోసం ఓ కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాకి 'డెవిల్' అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్న ఆయన.. రణ్ బీర్ కపూర్కి కథ నేరేట్ చేశారు. అయితే కొన్నికారణాల వల్ల రణ్ బీర్ కపూర్ ఈ ప్రాజెక్టుపై అంతగా ఆసక్తిని చూపలేదని సమాచారం.
దీంతో ఇదే కథను టాలీవుడ్ యంగ్ హీరో ప్రభాస్కి వినిపించి.. ఓకే చేయించుకున్నారట సందీప్ రెడ్డి. ఈ కథ వినగానే ప్రభాస్ ఫిదా అయ్యారని, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది. చూడాలి మరి ఈ ఇద్దరి కలయికలో కొత్త సినిమా వస్తుందో! లేదో.
ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నారు. చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఓ డియర్ అనే టైటిల్ పరిశీలనలో పెట్టారు మేకర్స్.