Don't Miss!
- News లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బాలీవుడ్లో అర్జున్ రెడ్డి దర్శకుడికి చుక్కెదురు.. ప్రభాస్కి చెప్పడంతో!
టాలీవుడ్లో మొదటి సినిమాతోనే సత్తా చాటారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. 'అర్జున్ రెడ్డి' రూపంలో ప్రేక్షకలోకానికి ఓ డిఫెరెంట్ మూవీ పరిచయం చేసి సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత అదే సినిమాను బాలీవుడ్ లో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి భారీ వసూళ్లు రాబట్టాడు. దీంతో అతితక్కువ కాలంలో టాలీవుడ్ టు బాలీవుడ్ అందరికీ సుపరిచితమయ్యారు సందీప్.
ఈ నేపథ్యంలో తన తర్వాతి సినిమాను కూడా బాలీవడ్ లోనే తీయాలని డిసైడ్ అయిన సందీప్ రెడ్డి వంగా.. రణ్ బీర్ కపూర్ కోసం ఓ కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాకి 'డెవిల్' అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్న ఆయన.. రణ్ బీర్ కపూర్కి కథ నేరేట్ చేశారు. అయితే కొన్నికారణాల వల్ల రణ్ బీర్ కపూర్ ఈ ప్రాజెక్టుపై అంతగా ఆసక్తిని చూపలేదని సమాచారం.
దీంతో ఇదే కథను టాలీవుడ్ యంగ్ హీరో ప్రభాస్కి వినిపించి.. ఓకే చేయించుకున్నారట సందీప్ రెడ్డి. ఈ కథ వినగానే ప్రభాస్ ఫిదా అయ్యారని, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది. చూడాలి మరి ఈ ఇద్దరి కలయికలో కొత్త సినిమా వస్తుందో! లేదో.
ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నారు. చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఓ డియర్ అనే టైటిల్ పరిశీలనలో పెట్టారు మేకర్స్.