Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలీవుడ్లో అర్జున్ రెడ్డి దర్శకుడికి చుక్కెదురు.. ప్రభాస్కి చెప్పడంతో!
టాలీవుడ్లో మొదటి సినిమాతోనే సత్తా చాటారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. 'అర్జున్ రెడ్డి' రూపంలో ప్రేక్షకలోకానికి ఓ డిఫెరెంట్ మూవీ పరిచయం చేసి సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత అదే సినిమాను బాలీవుడ్ లో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి భారీ వసూళ్లు రాబట్టాడు. దీంతో అతితక్కువ కాలంలో టాలీవుడ్ టు బాలీవుడ్ అందరికీ సుపరిచితమయ్యారు సందీప్.
ఈ నేపథ్యంలో తన తర్వాతి సినిమాను కూడా బాలీవడ్ లోనే తీయాలని డిసైడ్ అయిన సందీప్ రెడ్డి వంగా.. రణ్ బీర్ కపూర్ కోసం ఓ కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాకి 'డెవిల్' అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్న ఆయన.. రణ్ బీర్ కపూర్కి కథ నేరేట్ చేశారు. అయితే కొన్నికారణాల వల్ల రణ్ బీర్ కపూర్ ఈ ప్రాజెక్టుపై అంతగా ఆసక్తిని చూపలేదని సమాచారం.
దీంతో ఇదే కథను టాలీవుడ్ యంగ్ హీరో ప్రభాస్కి వినిపించి.. ఓకే చేయించుకున్నారట సందీప్ రెడ్డి. ఈ కథ వినగానే ప్రభాస్ ఫిదా అయ్యారని, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది. చూడాలి మరి ఈ ఇద్దరి కలయికలో కొత్త సినిమా వస్తుందో! లేదో.
ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నారు. చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఓ డియర్ అనే టైటిల్ పరిశీలనలో పెట్టారు మేకర్స్.