Don't Miss!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- News కాకినాడలో పవన్ పై జగన్ విమర్శల్లో తడబాటు..! పాలకొల్లులో పోటీ, నాలుగో సీటు...
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
సాహోకి సినిమాకి సెన్సార్ సమస్యలా..? హాట్ టాపిక్గా మారిన ఇష్యూ
ప్రభాస్ కెరీర్లో రాబోతున్న మరో భారీ బడ్జెట్ సినిమా 'సాహో'. బాహుబలి సిరీస్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ఆగస్టు 30వ తేదీన సాహోతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సినిమా విడుదల మరీ దగ్గర పడటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపవుతూ వస్తోంది. సరిగ్గా ఈ తరుణంలో సాహోకి సినిమాకి సెన్సార్ సమస్యలు తలెత్తాయనే ఓ వార్త ప్రభాస్ అభిమానులకు కలవరపెడుతోంది.
నిజానికి ఇప్పటికే సాహో సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, సెన్సార్ బోర్డు A సరిటిఫికేట్ జారీ చేసేందుకు సుముఖత చూపిందని తెలుస్తోంది. అయితే A సరిటిఫికేట్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరించకపోవడం తద్వారా సినిమా కలెక్షన్స్ పై ప్రభావం పడటం లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని భావించిన చిత్రయూనిట్ U/A సర్టిఫికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే U/A సర్టిఫికెట్ ఇవ్వాలంటే సాహోలో కొన్ని సీన్స్ కట్ చేయాలని సెన్సార్ బోర్డు తెలిపిందట. దీనికి చిత్రయూనిట్ ఓకే అందని ఫిలింనగర్ టాక్. మరో రెండు రోజుల్లో సాహో సెన్సార్ రిపోర్ట్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్పై దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్తో హై టెక్నికల్ వాల్యూస్తో తెరకెక్కింది సాహో సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. హీరోయిన్ శ్రద్ద కపూర్కి ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఇంకా ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు.