Don't Miss!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
సాహోకు ఊహించని షాక్?: చివరి నిమిషంలో!.., చేసేది లేక ఇప్పుడిలా..
బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న 'సాహో' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను అందుకోవడానికి చిత్ర యూనిట్ కూడా భారీగానే కసరత్తులు చేస్తోంది. మేకింగ్లో ఎక్కడా తగ్గకుండా.. హాలీవుడ్ స్థాయి ప్రమాణాలు కనిపించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఆ చిత్ర యూనిట్కు ఊహించని తగలడం చర్చనీయాంశంగా మారింది.
యాక్షన్ సీన్స్:
సాహో టీమ్ విడుదల చేసిన మొదటి టీజర్ తోనే ఈ సినిమా భారీ యాక్షన్ సీన్స్ మేళవింపుతో ఉంటుందని అర్థమైంది. ముఖంపై రక్తం తుడుచుకుంటూ.. 'ఇట్స్ షో టైమ్..' అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ అందుకు ఊతమిచ్చింది.
యాక్షన్ సీన్స్కే 35-40కోట్లు:
ప్రేక్షకులు, అభిమానుల అంచనాలకు తగ్గట్లే.. మునుపెన్నడూ తెలుగు తెరపై చూడని తరహాలో యాక్షన్స్ సీన్స్ను తెరకెక్కించడానికి దర్శకుడు సుజిత్ ప్లాన్ చేసుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఏకంగా రూ.35-40కోట్లు కేవలం యాక్షన్ సీన్స్ కోసమే ఖర్చు చేస్తున్నారంటే.. ఏ స్థాయిలో సీన్స్ చిత్రీకరించబోతున్నారో అర్థం చేసుకోవచ్చు. హాలీవుడ్ టెక్నీషిన్ల ఆధ్వర్యంలో ఈ సీన్స్ తెరకెక్కించాలని దర్శకుడు భావిస్తున్నారట.
షాక్ తిన్న సాహో టీమ్..:
సినిమాకు హైలైట్గా నిలిచే యాక్షన్ ఎపిసోడ్నే తొలుత తెరకెక్కించాలని చిత్ర యూనిట్ భావించిదట. ఇందుకోసం దుబాయ్ లో భారీ ఏర్పాట్లే చేశారట. కానీ తీరా అక్కడికెళ్లాక.. చివరి నిమిషంలో స్థానిక అధికారుల నుంచి షూటింగ్స్కు అనుమతి లభించకపోవడంతో టీమ్ షాక్ తిన్నదట. దీంతో చేసేదేమి లేక తిరిగి హైదరాబాద్ వచ్చేసి.. వేరే షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
దుబాయిలోనే తెరకెక్కించే ఆలోచనలో..:
నిజానికి 75రోజుల పాటు దుబాయ్లో యాక్షన్ సీన్స్ తెరకెక్కించిన తర్వాతే టాకీ పార్ట్ సహా మిగతా సీన్స్ తెరకెక్కించాలనుకున్నారట. కానీ దుబాయ్ అధికారులు ఇచ్చిన షాక్కు షెడ్యూల్ తారుమారైపోయిందట.
హాలీవుడ్ టెక్నీషియన్స్ను
ప్రీ-ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసుకుని హాలీవుడ్ టెక్నీషియన్స్ను కూడా పిలిపించి.. ఇక షూట్ చేయడమే ఆలస్యం అనుకున్న తరుణంలో.. అనుమతులు రాలేదన్న సంగతి తెలిసిందట. దీంతో కొంత నిరాశపడ్డ.. తిరిగి అనుమతులు పొంది ఎలాగైనా దుబాయ్లో తాను అనుకున్న ప్లేస్ లలోనే షూటింగ్ చేయాలని దర్శకుడు సుజిత్ నిశ్చయించుకున్నాడట.
ఆ షెడ్యూల్ సమ్మర్లో?
జనవరి రెండో వారం నుంచి హైదరాబాద్లో ఒక షెడ్యూల్ పూర్తి చేసి.. దుబాయిలో చిత్రీకరణకు అన్ని అనుమతులూ వచ్చాక ఆ ఎపిసోడ్ షూట్ చేస్తారని సమాచారం.
బహుశా ఇక సమ్మర్ లోనే ఈ షూటింగ్ షెడ్యూల్ ఉండవచ్చునని అంటున్నారు. దుబాయిలో షూటింగ్ అనుమతుల కోసం.. ఇప్పటికే ఓ టీమ్ను కూడా అదే పనిలో ఉంచారట. షూటింగ్ అనుమతుల కోసం అన్ని క్లియర్ చేసే పనిలో వారు ఉన్నట్లు తెలుస్తోంది.