Don't Miss!
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
భయపెడుతోన్న ‘ఆదిపురుష్’ బడ్జెట్ లెక్కలు: ప్రభాస్ రెమ్యూనరేషనే అన్ని కోట్లు.. ఒక్క దానికే వంద కోట్లు
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి స్టార్ కిడ్గా ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే తన టాలెంట్ను నిరూపించుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఈ క్రమంలోనే 'బాహుబలి' సిరీస్తో దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుని పాన్ ఇండియా స్టార్గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ప్రభాస్.. వరుసగా భారీ చిత్రాలనే చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'ఆదిపురుష్' అనే సినిమాను చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ బడ్జెట్, రెమ్యూనరేషన్లు గురించి కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!
ఆ రెండు సినిమాలతో రేంజ్ పెరిగింది
టాప్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో యూనివర్శల్ స్టార్ అయిపోయాడు ప్రభాస్. అప్పటి నుంచి తన పంథాను మార్చుకున్న అతడు.. వరుసగా పాన్ ఇండియా చిత్రాలనే చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఇందులో భాగంగానే రెండేళ్ల క్రితం 'సాహో' అనే సినిమాను చేశాడు. ఇది దక్షిణాదిలో అంతగా ఆడకున్నా.. ఉత్తరాదిలో సూపర్ డూపర్ హిట్ అయింది.
మహేశ్ మూవీ నుంచి చెప్పకుండా తీసేశారు.. ఆ అమ్మాయి వల్ల నాపై కేసు పెట్టారు: నోరు విప్పిన ప్రకాశ్ రాజ్
బాలీవుడ్లోకి ప్రవేశిస్తున్న రెబెల్ స్టార్
వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. 'బాహుబలి' రాజులా.. 'సాహో'లో యాక్షన్ హీరోలా కనిపించిన అతడు.. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్తో 'రాధే శ్యామ్' అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో అతడు తొలిసారి రొమాంటిక్ పాత్రను చేస్తున్నాడు. ఈ క్రమంలోనే 'ఆదిపురుష్' అనే చారిత్రక సినిమాలోనూ నటిస్తున్నాడు. దీంతో బాలీవుడ్లోకి ప్రవేశిస్తున్నాడు.
పాన్ ఇండియా రేంజ్లో.. ఆ స్టార్లంతా
ఓం రౌత్ డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'. ఇందులో రెబెల్ స్టార్ రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను, దేవదుత్తా హనుమంతుడి పాత్రను చేస్తున్నాడు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్లు దీన్ని నిర్మిస్తున్నారు.
బీచ్లో లవర్తో పాయల్ రాజ్పుత్ రచ్చ: బికినీలో అందాలన్నీ చూపిస్తూ.. షాకిస్తోన్న సెల్ఫీ వీడియో
షూటింగ్ అప్డేట్.. ప్రభాస్ అక్కడేనట
ప్రభాస్ నటిస్తోన్న 'ఆదిపురుష్' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోన్న సమయంలో కరోనా సెకెండ్ వేవ్ దానికి బ్రేక్ వేసింది. దీంతో ఆ మధ్య నిలిచిపోయిన ఈ సినిమా షూట్ ఇటీవలే పున: ప్రారంభం అయింది. ఇందులో ప్రభాస్ పాల్గొంటున్నాడు. ముంబై నగర శివారు ప్రాంతంలో వేసిన ప్రత్యేకమైన సెట్లో దీనికి సంబంధించిన చిత్రీకరణ వేగంగా జరుగుతుందని సమాచారం.
‘ఆదిపురుష్' విడుదల తేదీ ఖరారు
పాన్ ఇండియా రేంజ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఆదిపురుష్' మూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. ఐదో భాషల్లో ఇది తెరకెక్కుతోంది. ఇక, ఈ సినిమా విడుదలపై చాలా రోజులుగా ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని 2022 ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారని ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది.
బట్టలు లేకుండా దిగిన ఫొటో వదిలిన శృతి హాసన్: ఆ ప్లేస్లో టాటూ.. ఎవరి పేరు ఉందో తెలిస్తే!
అన్ని కోట్లతో తెరకెక్కుతోన్న ఆదిపురుష్
క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న 'ఆదిపురుష్' మూవీ బడ్జెట్ గురించి చాలా రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ సినిమాను రూ. 400 కోట్ల బడ్జెట్తో తీస్తున్నారట. అందులో రూ. 100 కోట్లు కేవలం వీఎఫ్ఎక్స్ వర్క్స్కే కేటాయించారని తెలిసింది. ఇందుకోసం ఓ సంస్థతో డీల్ చేసుకున్నారట.
ప్రభాస్కు అంత.. మిగిలిన వాళ్లు ఇంత
'ఆదిపురుష్' మూవీ కోసం నిర్మాతలు వెచ్చిస్తోన్న రూ. 400 కోట్లలో రూ. 100 కోట్లు గ్రాఫిక్స్కు పోగా.. రూ. 50 కోట్లు ఇతరత్రా షూటింగ్ కార్యక్రమాలకు కేటాయించారట. మిగిలిన రూ. 250 కోట్లలో ఒక్క ప్రభాస్కు మాత్రమే రూ. 150 కోట్లు రెమ్యూనరేషన్గా చెల్లిస్తున్నారని సమాచారం. మిగిలిన మొత్తాన్ని ఇతర నటీనటులకు ముట్టజెప్పేలా ప్లాన్ చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.