Don't Miss!
- Sports KKR vs RR: అతని వల్లే ఈ సెంచరీ: సునీల్ నరైన్
- News బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Automobiles ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. మరో భారీ ప్రాజెక్టులో రెబల్ స్టార్.. ఇంట్రెస్టింగ్ రోల్!
భారీ ప్రాజెక్టులకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇటీవలే సాహి రూపంలో భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఇదిలా ఉండగానే ప్రభాస్ మరో భారీ ప్రాజెక్టు కోసం సిద్దమవుతున్నాడనే వార్త వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ భారీ ప్రాజెక్టు ఏంటి? వివరాల్లోకి పోతే..
భారీ సినిమా 'రామాయణ'
భారత దేశ సినీ పరిశ్రమలో 'రామాయణ' రూపంలో మరో భారీ సినిమాకు శ్రీకారం చుట్టబడిన సంగతి తెలిసిందే. దాదాపు 1500 కోట్ల భారీ బడ్జెట్, ఉన్నత విలువలతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ సినిమా నిర్మాణంలో ముగ్గురు నిర్మాతలు భాగం కానుండగా.. అందులో ఒకరిగా టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ ఉండటం ఆసక్తికర అంశం.
ఇద్దరు డైరెక్టర్లు.. ముగ్గురు నిర్మాతలు
ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇద్దరు డైరెక్టర్లు రామాయణ సినిమాను తెరకెక్కించబోతున్నారు. 'దంగల్' ఫేం నితేశ్ తివారీ, శ్రీదేవి ప్రధాన పాత్రలో వచ్చిన 'మామ్' డైరెక్టర్ రవి ఉద్యవార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ప్రపంచ ఆడియన్స్ టార్గెట్గా భారీ హంగులతో ఈ సినిమా తెరకెక్కనుంది. అల్లు అరవింద్ సహా నమిత్ మల్హోత్రా, మధు మంతెన ఈ సినిమా నిర్మాణంలో భాగం కానున్నారు.
మూడు భాగాలు భారీ తారాగణం
మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమాలో పలు భాషల్లోని భారీ తారాగణం పాలుపంచుకోనుంది. రాముడిగా హృతిక్ రోషన్ని, సీతాదేవిగా దీపికా పదుకొనేను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇందులో మరో ముఖ్యమైన పాత్ర అయిన రావణుడి కోసం ప్రభాస్ పేరును పరిశీలిస్తున్నారట దర్శకనిర్మాతలు.
సాహో క్రేజ్ క్యాచ్ చేసుకునేలా
ఇటీవలే ప్రభాస్ సాహో సినిమాతో ఇతర భాషల్లోనూ భారీ క్రేజ్ సంపాదించిన సంగతి తెలిసిందే. అప్పుడు బాహుబలి, ఇప్పుడు సాహో ద్వారా ప్రభాస్ దేశంలోని అన్ని భాషల ఆడియన్స్కి సుపరిచితం అయ్యాడు. దీంతో ఆయనకున్న ఈ క్రేజ్ క్యాచ్ చేసుకునేలా 'రామాయణ' చిత్రంలో ప్రభాస్ ని భాగం చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
ప్రీ ప్రొడక్షన్ పనుల్లో రామాయణ
ఇటీవలే ప్రకటించబడిన రామాయణ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మొత్తం మూడు పార్టులుగా రూపొందించబోతున్న రామాయణ సిరీస్ మొదటి భాగాన్ని 2021లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.