Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వేగంపెంచిన ప్రభాస్ 20.. రంగంలోకి ఆ మ్యూజిక్ డైరెక్టర్!
ఇటీవలే సాహో రూపంలో నిరాశపర్చిన యంగ్ రెబల్స్టార్ ప్రభాస్.. ఆ జ్ఞాపకాలు మరిపించేలా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ పూర్తిచేసిన చిత్రయూనిట్ జార్జియాలో కీలక సన్నివేశాల చిత్రీకరణలో నిమగ్నమైంది. కరోనాను సైతం లెక్కచేయకుండా యూనిట్ అంతా తెగ కష్టపడుతోంది. ఎప్పటికప్పుడు వస్తున్న సినిమా అప్డేట్స్ ప్రభాస్ అభిమానుల్లో ఆతృతను రెట్టింపు చేస్తున్నాయి.
తాజాగా చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే దానిపై క్లారిటీ వచ్చేసింది. లేటెస్ట్గా అందిన సమాచారం మేరకు ఈ సినిమాకు అమిత్ త్రివేది నేపథ్య సంగీతాన్ని అందిస్తాడని తెలుస్తోంది. పీరియాడికల్ లవ్స్టోరిగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ''ఓ డియర్'' అనే టైటిల్ పరిశీలనలో పెట్టారు.
ఉగాది కానుకగా మార్చి 25న ఈ సినిమా టైటిల్ కన్ఫామ్ చేస్తూ ఫస్ట్లుక్ విడుదల చేసి అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని ప్రభాస్ డిసైడ్ అయ్యారట. ఈ మేరకు అందుకు సంబంధించిన పనుల్లో చిత్రయూనిట్ నిమగ్నమైందని తాజా సమాచారం. ప్రభాస్ కెరీర్లో 20వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.