Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
'విక్రమార్కుడు'చిత్రానికి ప్రీక్వెల్ ప్లానింగ్
రవితేజ 'విక్రమార్కుడు'చిత్రం రీసెంట్ గా హిందీలో ప్రభుదేవా 'రౌడీ రాథోర్'టైటిల్ తో రీమేక్ చేసి రూపొందించి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి ప్రీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీక్వెల్ చాలా మంది చేస్తారా అని అడుగుతూంటే ప్రభుదేవా నేను ప్రీక్వెల్ చేస్తాను అని అన్నారు. దాంతో 'రౌడీ రాథోర్'కి ప్రీక్వెల్ అనే టాక్ బాలీవుడ్ మీడియాలో మొదలైంది. ప్రభుదేవా ప్రీక్వెల్ తీస్తే దాన్ని తెలుగులోనూ ప్లాన్ చేసే అవకాశముందని చెప్తున్నారు.
ఇక ఈ చిత్రం ఓపినింగ్స్ మాత్రం అదరిపోయే రేంజిలో తెచ్చుకుంది. ఇండియాలో దాదాపు పదిహేను కోట్లకు పైగా మొదటి రోజు కలెక్టు చేసి రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రాన్ని అక్కడ మీడియా ఓ పాత కాలం సినిమాగా కొట్టిపారేసినా రోజు రోజుకీ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ఈ చిత్రం దూసుకుపోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వందకోట్లను ఈజీగా ఈ చిత్రం దాటేసింది. ఇక ఈ చిత్రం ప్రీక్వెల్ విషయానికి వస్తే దాన్ని యూటివి వాళ్ళు నిర్మిస్తారని తెలుస్తోంది.
ప్రీక్వెల్ లో విక్రమ్ రాధోడ్ పాత్ర తో పూర్తిగా నడుస్తుందని,అతను ఆ విలేజ్ కి ఎలా వచ్చాడు. అతనకి వివాహం ఎలా అయ్యింది. విలన్ ఉన్న విలేజ్ కి రాకముందు అతను ఎలా ఉండేవాడు అన్న అంశాలతో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆపీసర్ ని చిత్రీకరిస్తూ స్క్రీన్ ప్లే సాగనుందని వినిపిస్తోంది. అలాగే ఈ చిత్రానికి డోంట్ ఏంగ్రీ మి అనే టైటిల్ ని పెట్టనున్నారని చెప్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ప్రీక్వెల్ మొదలుకాదని,షాహిద్ కపూర్ తో ప్రభుదేవా చేయనున్న నమక్ చిత్రం పూర్తయ్యాక ఈ చిత్రం గురించి ఆలోచిస్తారని చెప్తున్నారు.
ఇక ఈ చిత్రం మొన్నీ మధ్య తమిళంలో కార్తీ హీరోగా చిరుతై క్రింద రీమేకైంది. ప్రభుదేవా దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రం ఓ రేంజి బిజినెస్ జరిగిందని సమాచారం. పోకిరీ ని వాంటెడ్ మార్చి బాలీవుడ్ లో హిట్ కొట్టిన ప్రభుదేవాపై నమ్మకంతో ఈ ప్రాజెక్టుని అప్పచెప్పినట్లు చెప్తున్నారు. సోనాక్షి సిన్హా ఈ చిత్రంలో అనూష్క పాత్రను చేసింది. ఈ చిత్రం పక్కా మాస్ మశాలా గా రూపొందించటానికి ప్రభుదేవా చాలా రోజులు పాటు స్క్రిప్టు పై కసరత్తులు చేసి తెరకెక్కించారు. అక్షయ్ కుమార్ సైతం చాలా రోజుల తర్వాత తాను ఇలాంటి మాస్ హీరో పాత్ర చేయటంతో చాలా సంతోషంగా ఉన్నాడు.