Don't Miss!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘అరుంధతి’ని కాపీ కొట్టి ప్రభుదేవా..?
ముంబై: ఆ మధ్య తమిళ, మలయాళ సినిమాలను బాలీవుడ్ తెరకెక్కించి హిట్లు కొట్టాడు దర్శకుడు ప్రియదర్శన్. ఇప్పుడా వారసత్వాన్ని ప్రభుదేవా అందుకున్నాడు. పోకిరి,విక్రమార్కుడు చిత్రాలను రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టి అక్కడ మంచి కమర్షియల్ దర్శకుడుగా ముద్ర వేయించుకున్నాడు. ఈ నేపధ్యంలో ఆ మధ్యన తెలుగులో అనూష్క ప్రధాన పాత్రలో చేసిన 'అరుంధతి' సినిమాని కొద్దిగా అటూ ఇటూ మార్చి హిందీ తెరకు ఎక్కించే ప్రయత్నాల్లో ఉన్నట్లు బాలీవుడ్ సమాచారం.
త్వరలో 'అరుంధతి' సినిమాను ప్రేరణగా తీసుకొని ఓ సరికొత్త కథాంశంతో ప్రభుదేవా ఈ సినిమా చేయనున్నారని సమాచారం. బాలీవుడ్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రధాన పాత్రను సోనాక్షి సిన్హా పోషిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుదేవా దర్శకత్వంలో సోనాక్షి 'రౌడీ రాథోడ్' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాంతో ఆమె మరోసారి ప్రభుదేవాతో చేయాలని ఉత్సాహపడుతోంది. అంతేగాక త్వరలో రిలీజవుతున్న అక్షయ్కుమార్ 'ఓ మై గాడ్' సినిమా కోసం ప్రభుదేవా నృత్య దర్శకత్వంలో ఓ ఐటం సాంగ్ లో కూడా నర్తించారు సోనాక్షి.
ప్రస్తుతం తన వద్ద నాట్యంలో మెళకువలు నేర్చుకుంటున్న సోనాక్షికి ఇటీవలే ప్రభుదేవా ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారట. దాంతో ఈ పాత్రను సోనాక్షి కూడా ఓ ఛాలెంజ్గా తీసుకున్నారని సమాచారం. వంద కోట్ల భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ సినిమాను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుంది. ఇక అరుంధతి చిత్రాన్ని హిందీలో చేయాలని చాలా కాలం నుంచీ ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ..ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. దాంతో ఈ రకంగా అరుంధతిని ప్రేక్షకులకు చూపించాలని ప్రభుదేవా ఫిక్స్ అయ్యారు.
ప్రస్తుతం ప్రభుదేవా తెలుగులో ఘన విజయం సాధించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. హిందీ రీమేక్కి కుమార్ తరౌనీ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఈ సినిమాతో ఆయన కుమారుడు గిరీష్ కథానాయకుడిగా పరిచయం కాబోతున్నారు. శృతిహాసన్ ని హీరోయిన్ గా చేస్తోంది. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' స్క్ర్రిప్టులో ఛేంజ్ లు రాసి,నార్త్ కి తగినట్లు కామిడీని మార్చి తిరగరాస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.