Don't Miss!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- News మోదీ ప్రధాని అయ్యే వరకు నిద్రపోము, ఎవరు మునిగిపోతారో జూన్ 4వ తేదీ తెలుస్తుంది సీఎం గారు !
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘అరుంధతి’ని కాపీ కొట్టి ప్రభుదేవా..?
ముంబై: ఆ మధ్య తమిళ, మలయాళ సినిమాలను బాలీవుడ్ తెరకెక్కించి హిట్లు కొట్టాడు దర్శకుడు ప్రియదర్శన్. ఇప్పుడా వారసత్వాన్ని ప్రభుదేవా అందుకున్నాడు. పోకిరి,విక్రమార్కుడు చిత్రాలను రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టి అక్కడ మంచి కమర్షియల్ దర్శకుడుగా ముద్ర వేయించుకున్నాడు. ఈ నేపధ్యంలో ఆ మధ్యన తెలుగులో అనూష్క ప్రధాన పాత్రలో చేసిన 'అరుంధతి' సినిమాని కొద్దిగా అటూ ఇటూ మార్చి హిందీ తెరకు ఎక్కించే ప్రయత్నాల్లో ఉన్నట్లు బాలీవుడ్ సమాచారం.
త్వరలో 'అరుంధతి' సినిమాను ప్రేరణగా తీసుకొని ఓ సరికొత్త కథాంశంతో ప్రభుదేవా ఈ సినిమా చేయనున్నారని సమాచారం. బాలీవుడ్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రధాన పాత్రను సోనాక్షి సిన్హా పోషిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుదేవా దర్శకత్వంలో సోనాక్షి 'రౌడీ రాథోడ్' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాంతో ఆమె మరోసారి ప్రభుదేవాతో చేయాలని ఉత్సాహపడుతోంది. అంతేగాక త్వరలో రిలీజవుతున్న అక్షయ్కుమార్ 'ఓ మై గాడ్' సినిమా కోసం ప్రభుదేవా నృత్య దర్శకత్వంలో ఓ ఐటం సాంగ్ లో కూడా నర్తించారు సోనాక్షి.
ప్రస్తుతం తన వద్ద నాట్యంలో మెళకువలు నేర్చుకుంటున్న సోనాక్షికి ఇటీవలే ప్రభుదేవా ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారట. దాంతో ఈ పాత్రను సోనాక్షి కూడా ఓ ఛాలెంజ్గా తీసుకున్నారని సమాచారం. వంద కోట్ల భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ సినిమాను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుంది. ఇక అరుంధతి చిత్రాన్ని హిందీలో చేయాలని చాలా కాలం నుంచీ ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ..ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. దాంతో ఈ రకంగా అరుంధతిని ప్రేక్షకులకు చూపించాలని ప్రభుదేవా ఫిక్స్ అయ్యారు.
ప్రస్తుతం ప్రభుదేవా తెలుగులో ఘన విజయం సాధించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. హిందీ రీమేక్కి కుమార్ తరౌనీ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఈ సినిమాతో ఆయన కుమారుడు గిరీష్ కథానాయకుడిగా పరిచయం కాబోతున్నారు. శృతిహాసన్ ని హీరోయిన్ గా చేస్తోంది. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' స్క్ర్రిప్టులో ఛేంజ్ లు రాసి,నార్త్ కి తగినట్లు కామిడీని మార్చి తిరగరాస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.