Don't Miss!
- News కాంగ్రెస్ ఒకేఒక్క అజెండా అదే; కుత్సితమైన చిల్లర రాజకీయం: భగ్గుమన్న కేటీఆర్
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Finance Success Story: పుట్టింది చిన్న టైలర్ కొడుకుగా.. ప్రస్తుతం బిలియనీర్.. ఇదిరా సక్సెస్ అంటే..
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాలకృష్ణ 100వ చిత్రానికి దర్శకుడు ఖరారు?
హైదరాబాద్: ఇటీవల వచ్చిన 'శ్రీమన్నారాయణ' చిత్రం బాలకృష్ణకు 97వ చిత్రం. మరో రెండు చిత్రాలు చేస్తే వందవ చిత్రం ముంగిట్లోకి వచ్చేసినట్లే. ఆ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు.. ఎవరు నిర్మిస్తారు.. అనే విషయమై గత కొంతకాలంగా చిత్రసీమలో చర్చ జరుగుతోంది. అయితే ఆ చిత్రానికి దర్శకుడు ఖరారైనట్లే అని తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు.. రాఘవేంద్రరావు కుమారుడు కోవెలమూడి సూర్య ప్రకాష్ అని తెలుస్తోంది.
నందమూరి బాలకృష్ణ త్వరలో వందవ చిత్రం చేరువకానున్నారు. తన కెరీర్ లో ది బెస్ట్ గా ఆ చిత్రం నిలబడాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి ని దర్శకుడుగా ఎంచుకున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని శ్రీరామరాజ్యం నిర్మాత సాయిబాబా నిర్మించనున్నారు. ఈ మేరకు బాలకృష్ణతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రకాష్ చెప్పిన ఓ కథకు బాలకృష్ణ ఓకే చేసాడని, గ్రాఫిక్స్ తో కూడిన జానపద చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది.
అనగనగా ఒక ధీరుడు చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన సూర్య ప్రకాశ్ ఆ చిత్రం ఘోర పరాజయంతో మళ్లీ మెగాఫోన్ పట్టలేదు. అయితే ఇప్పుడు బాలకృష్ణను డైరక్ట్ చేసే అవకాశం వచ్చిందనేది హాట్ టాపిక్ గా ఫిల్మ్ సర్కిల్స్ లో మారింది. తన తొలి సినిమా ఫెయిల్యూర్ అయినా గ్రాఫిక్స్ లోనూ, హీరోను ఎలివేట్ చేసే సన్నివేశాల్లోనూ ప్రకాష్ తన ప్రతిభను చూపించాడని, జానపద కథను బాగా తీసాడని అప్పట్లో వినిపించింది. దాంతో జానపద చిత్రం తరహా రీమేక్ కి ఈ యువ దర్శకుడుని అడిగినట్లు చెప్తున్నారు.
మరో ప్రక్క ఎన్టీఆర్ కెరీర్ లో బెస్ట్ చిత్రంగా నిలిచిన చిత్రం భట్టి విక్రమార్క రీమేక్ అయ్యే అవకాసం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. జానపద కథను వెండి తెర కావ్యంగా మలిచి అప్పట్లో హిట్ కొట్టారు. ఈ జనరేషన్ పిల్లలకు సైతం ఆ పాత్ర,ఆ కథను పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో యలమంచిలి సాయిబాబు ఈ నిర్మాణానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. భారీగా ఈ చిత్రాన్ని ఆయన నిర్మించనున్నారు.