Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
ప్రభాస్ విషయంలో ప్రశాంత్ నీల్ టెన్షన్.. ఆ పని చేసే దాకా నో షూట్ అంటూ?
బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ఏ సినిమా చేసినా వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే బాహుబలి తర్వాత ఆయన చేసిన సాహో సినిమా కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లు సాధించి, ఎక్కడా నష్టాలు రాకుండా చేసింది. కానీ తాజాగా వచ్చిన రాధేశ్యామ్ సినిమా మాత్రం కలెక్షన్స్ విషయంలో కాస్త ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. ప్రస్తుతం అయిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తుండగా ప్రభాస్ వ్యవహారంతో ప్రశాంత్ నీల్ కాస్త టెన్షన్ ఫీల్ అవుతున్నాడు అని తెలుస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే
సలార్
బాహుబలి
అనే
ఒక
దృశ్య
కావ్యం
ఎంతగా
హిట్టయింది
అనేది
ప్రత్యేకంగా
చెప్పాల్సిన
అవసరం
లేదు.
ఆ
సినిమా
చేసిన
రాజమౌళికి
ఎంత
పేరు
వచ్చిందో
హీరోగా
నటించిన
ప్రభాస్
కి
కూడా
అంతే
పేరు
వచ్చింది.
ఈ
నేపథ్యంలోనే
ప్రభాస్
చేస్తున్న
ప్రతి
సినిమా
పాన్
ఇండియా
లెవల్లో
ఇండియాలో
విడుదలవుతోంది.
ఇప్పటికే
సినిమాలను
లైన్
లో
పెట్టిన
ప్రభాస్
ప్రస్తుతానికి
కేజిఎఫ్
సృష్టికర్త
ప్రశాంత్
నీల్
దర్శకత్వంలో
సలార్
అనే
సినిమా
చేస్తున్నాడు.
ఈ
సినిమాను
హోంబలే
ఫిలిమ్స్
బ్యానర్
మీద
విజయ్
కిరగందూర్
నిర్మిస్తున్నారు.
షూటింగ్ చేసేది లేదు
అయితే తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ప్రశాంత్ నీల్, ప్రభాస్ లుక్ విషయంలో ఏ మాత్రం సంతోషంగా లేదని తెలుస్తోంది. తాను అనుకున్న లుక్కు వేరని కానీ ప్రభాస్ ప్రస్తుతం ఉన్న లుక్కు వేరుగా ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారట. మొహమాటానికి పోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అని భావించి లుక్ మారే వరకు షూటింగ్ చేసేది లేదు అని ప్రభాస్ కి ప్రశాంత్ నీల్ తేల్చి చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది.
సన్నగా చూపించే ప్రయత్నం
నిజానికి ప్రభాస్ లుక్ విషయంలో కొద్ది రోజుల క్రితం ట్రోల్స్ కూడా నడిచిన సంగతి తెలిసిందే. ఆయన ముంబైలో కారులో వెళుతున్న సమయంలో ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తియ్యగా ఆ లుక్ బయటకు వచ్చాక పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.. అయితే రాధేశ్యామ్ సినిమాలో మాత్రం ఆయన చాలా స్లిమ్ గా కనిపించాడు. ఈ మాయాజాలం ఏమిటో ప్రేక్షకులకు పెద్దగా అర్థం కాలేదు. అయితే ప్రభాస్ తో సినిమా చేస్తున్న వారు ఆయనను గ్రాఫిక్స్ లో సన్నగా చూపించే ప్రయత్నం చేస్తున్నారట.
షూటింగ్ లేదని చెప్పడంతో
అయితే పర్ఫెక్షన్ విషయంలో రాజమౌళికి ఏమాత్రం తీసిపోని ప్రశాంత్ తాను అలా చేయడానికి విరుద్ధం అని, మీరు పూర్తిగా సన్నబడిన తరువాతే సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని ప్రభాస్ కు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ప్రభాస్ ఎప్పటికి సన్నబడతాడో సినిమా ఎప్పటికి పూర్తవుతుందో అని ఆయన టెన్షన్ పడుతున్నాడని ప్రభాస్ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడని సన్న బడే వరకు షూటింగ్ లేదని చెప్పడంతో ఆయన ఇప్పటికీ వర్కౌట్స్ ప్రారంభించాడని అంటున్నారు.
డైట్ ప్లానింగ్ తో
పర్ఫెక్ట్ డైట్ ప్లానింగ్ తో వీలైనంత త్వరగా బరువు తగ్గే విధంగా ప్రభాస్ ప్లాన్ చేసుకున్నాడని అంటున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ ఫిలిం నగర్ వర్గాల్లో మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ ఈ సినిమా కాకుండా మరిన్ని సినిమాలు లైన్ లో పెట్టారు. ప్రకటించిన సినిమాలు కాకుండా మారుతి దర్శకత్వంలో కూడా ఆయన ఒక సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు.